ETV Bharat / jagte-raho

ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని ప్రేమికుడు సెల్ఫీ సూసైడ్

author img

By

Published : Sep 14, 2020, 2:30 PM IST

దోస్తులు ఇక సెలవు అంటూ ఓ ప్రేమికుడు బలవన్మరణం చేసుకున్నాడు. ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణలోని కరీంనగర్​లో ఈనెల 10న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Lover selfie suicide in karimnagar district
Lover selfie suicide in karimnagar district
ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని ప్రేమికుడు సెల్ఫీ సూసైడ్

అన్నా.. ఎవ్వరినీ ప్రేమించకండి.. ఎవరినైనా ప్రేమించినా చచ్చేదాక మన వెంట ఉంటారో ఒకసారి చెక్ చేసుకోండని కరీంనగర్​లో ఓ యువకుడు సెల్ఫీ రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే జీవితంలో సంతోషంగా ఉండాలి. మనం అనుకున్నోళ్లు మనతో లేకపోతే సంతోషంగా ఉండలేము. అందరూ ఫ్రెండ్స్‌.. నా గల్లీ దోస్త్‌లు.. టెన్త్‌ దోస్త్‌లు.. ప్రతి ఒక్కరికి ఇక బై.. బై..!’’ అంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు చరవాణిలో సెల్పీ వీడియోలో మాట్లాడాడు. ఆదివారం తెలంగాణలోని కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయవిదారకంగా తన బాధను వెళ్లగక్కుతూ బలవన్మరణానికి పాల్పడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

మనస్పర్థలు రావడం

నగరంలోని సప్తగిరికాలనీకి చెందిన పాములపర్తి సాయికిరణ్‌(29)ఓ చరవాణి సంస్థకు సంబంధించి పెద్దపల్లి, గోదావరిఖనిలో సిటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని కొన్నాళ్లుగా ప్రేమించాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఆ యువతి సాయికిరణ్‌తో పెళ్లికి నిరాకరించింది. తీవ్ర మనోవేదనకు గురైన అతను ఈనెల 10న తన బాధను వీడియో ద్వారా చిత్రీకరించి బంధువులకు, స్నేహితులకు పంపించాడు.

కేసు దర్యాప్తు

ప్రేమించొద్ధూ అని చెబుతూనే.. మిత్రులకు ఇక సెలవంటూ.. తన చేతిలో ఉన్న పురుగుల మందును తాగి కిందపడిపోయాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు, కుటుంబీకులు పద్మానగర్‌ శివారు ప్రాంతంలో పడిపోయి ఉన్నాడని గుర్తించి చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ సాయి కిరణ్‌ మృతి చెందాడు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రెండో ఠాణా ఎస్సై టి.మహేష్‌ వివరించారు.

ఇదీ చూడండి:

'స్వర్ణ ప్యాలెస్ కేసులో ఛైర్మన్​ను కస్టడీలోకి తీసుకోవద్దు'

ప్రేయసి పెళ్లికి నిరాకరించిందని ప్రేమికుడు సెల్ఫీ సూసైడ్

అన్నా.. ఎవ్వరినీ ప్రేమించకండి.. ఎవరినైనా ప్రేమించినా చచ్చేదాక మన వెంట ఉంటారో ఒకసారి చెక్ చేసుకోండని కరీంనగర్​లో ఓ యువకుడు సెల్ఫీ రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే జీవితంలో సంతోషంగా ఉండాలి. మనం అనుకున్నోళ్లు మనతో లేకపోతే సంతోషంగా ఉండలేము. అందరూ ఫ్రెండ్స్‌.. నా గల్లీ దోస్త్‌లు.. టెన్త్‌ దోస్త్‌లు.. ప్రతి ఒక్కరికి ఇక బై.. బై..!’’ అంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు చరవాణిలో సెల్పీ వీడియోలో మాట్లాడాడు. ఆదివారం తెలంగాణలోని కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయవిదారకంగా తన బాధను వెళ్లగక్కుతూ బలవన్మరణానికి పాల్పడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

మనస్పర్థలు రావడం

నగరంలోని సప్తగిరికాలనీకి చెందిన పాములపర్తి సాయికిరణ్‌(29)ఓ చరవాణి సంస్థకు సంబంధించి పెద్దపల్లి, గోదావరిఖనిలో సిటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతిని కొన్నాళ్లుగా ప్రేమించాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్ల ఆ యువతి సాయికిరణ్‌తో పెళ్లికి నిరాకరించింది. తీవ్ర మనోవేదనకు గురైన అతను ఈనెల 10న తన బాధను వీడియో ద్వారా చిత్రీకరించి బంధువులకు, స్నేహితులకు పంపించాడు.

కేసు దర్యాప్తు

ప్రేమించొద్ధూ అని చెబుతూనే.. మిత్రులకు ఇక సెలవంటూ.. తన చేతిలో ఉన్న పురుగుల మందును తాగి కిందపడిపోయాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు, కుటుంబీకులు పద్మానగర్‌ శివారు ప్రాంతంలో పడిపోయి ఉన్నాడని గుర్తించి చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ సాయి కిరణ్‌ మృతి చెందాడు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రెండో ఠాణా ఎస్సై టి.మహేష్‌ వివరించారు.

ఇదీ చూడండి:

'స్వర్ణ ప్యాలెస్ కేసులో ఛైర్మన్​ను కస్టడీలోకి తీసుకోవద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.