సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి 14.3 లక్షలు దోచుకున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్కు చెందిన డాక్టర్ అర్జున్ రావు ఇంటర్నెట్ బ్యాంకింగ్తో లింకై ఉన్న మెయిల్ ఐడీని హ్యాక్ చేసి 8 లక్షల రూపాయలను.. సైబర్ చీటర్స్ కాజేశారు. మరో ఘటనలో... కాచిగూడకి చెందిన శేషగిరిరావు తన క్రెడిట్ కార్డ్ బిల్లు ఆన్లైన్లో కట్టే సందర్భంలో ఓ యాప్ డౌన్లోడ్ చేశాడు.
తన అకౌంట్లో ఉన్న 6.3 లక్షల రూపాయలు మాయమయ్యాయి. మోసపోయామని తెలుసుకున్న ఇద్దరు బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈ మెయిల్ లింక్ ఉన్న వినియోగదారులు మెయిల్కి వచ్చే ఓటీపీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: