హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లో డిసెంబరు 8న రూ.కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను బిహారీ ముఠా దొంగిలించింది. చోరీ చేశాక ముఠా సభ్యులు బిహార్లోని మధుబని ప్రాంతానికి పారిపోయారు. బంగారు నగలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. వజ్రాల, నగలు మాత్రం మూటగట్టి ఓ ఇంట్లోని పశువుల కొట్టంలోని భూమిలో పాతిపెట్టారు. మరికొంత గోడలో దాచిపెట్టారు.
ఆరుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేసిన పోలీసుల బృందం సొత్తును చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ బుధవారం హైదరాబాద్లో వెల్లడించారు.