ETV Bharat / international

50 వేల జవాన్లతో రష్యా సైనిక విన్యాసాలు.. భారత్​, చైనా సహా!

author img

By

Published : Sep 1, 2022, 7:06 AM IST

రష్యా మరోసారి భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి వారం రోజులపాటు జరగనున్న ఈ యుద్ధ విన్యాసాల్లో భారత్‌, చైనా సహా మాజీ సోవియట్‌ దేశాలు పాల్గొంటాయని మాస్కో ప్రకటించింది. రష్యాతో కలిసి ఇతర దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొనటంపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది.

russia drills
russia drills

Russia Drills Ukraine: ఉక్రెయిన్‌పై సైనికచర్య జరుపుతున్న రష్యా.. మరోసారి మిత్రదేశాలు, మాజీ సోనియట్‌ దేశాలతో కలిసి ఇవాళ భారీఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభించనుంది. ఈ నెల ఏడో తేదీ వరకు వస్టాక్‌ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాల్లో భారత్‌, చైనా, లావోస్‌, మంగోలియా, నికరగ్వా, సిరియాతోపాటు మరికొన్ని మాజీ సోవియట్‌ దేశాలు పాల్గొంటాయని మాస్కో ప్రకటించింది.

వ్యూహాత్మక విన్యాసాల్లో 50వేల సైనికదళాలు, 5వేల కంటే ఎక్కువగా ఆయుధాలు, మిలిటరీ హార్డ్‌వేర్‌ ముఖ్యంగా 140యుద్ధవిమానాలు, 60 యుద్ధనౌకలు, గన్‌ బోట్లు, మద్దతు పడవలు పాల్గొంటాయి. సైనిక కమాండర్లలో నైపుణ్యాలు పెంచటానికి, సైనిక ప్రధాన కార్యాలయాలు ఆదేశాలు ఇవ్వటానికి, తూర్పు దిశతోపాటు తూర్పు సముద్ర ప్రాంతంలో దండయాత్రలను తిప్పికొట్టడం, తూర్పు ప్రాంతంలో మిలిటరీ రక్షణకు భరోసా, మిత్ర దేశాల ప్రయోజనాలను కాపాడటం, శాంతి పరిరక్షణ వంటి లక్ష్యాలను.. సంయుక్తంగా ఎదుర్కొనేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వస్టాక్‌ సైనిక విన్యాసాల్లో పాల్గొనే భారత సైన్యం రోజూవారీ కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలను రష్యా సైన్యం విడుదల చేసింది. రష్యాలోని గుర్తు తెలియని ప్రాంతంలో భారత సైనికుల కవాతు, జవాన్లు వంట చేయటం, వారు పాటలు పాడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. రష్యాకు చెందిన ఇతర బలగాలతోపాటు వైమానిక దళాలు, దీర్ఘశ్రేణి బాంబర్లు, మిలిటరీ రవాణా విమానాల ఈ విన్యాసాల్లో పాల్గొంటాయని మాస్కో రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా-చైనా నౌక దళాలు జపాన్‌ సముద్రంలో యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటాయని పేర్కొంది. సముద్ర సమాచార వ్యవస్థలు, సముద్ర ఆర్థిక వ్యవహారాలను కాపాడటంతోపాటు సముద్రతీర ప్రాంతాల్లో దళాలకు సాయం అందించటమే రష్యా-చైనా నౌకా విన్యాసాల లక్ష్యమని మాస్కో ప్రకటించింది.

గతేడాది జపాడ్‌ పేరుతో రష్యా నిర్వహించిన సైనిక విన్యాసాల్లో భారత్‌తోపాటు చైనా, పాకిస్థాన్‌లు పాల్గొన్నాయి. సైన్యం లేదా రక్షణ శాఖ కానీ స్పందించలేదు.అయితే ఈ సైనిక విన్యాసాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై కూర్రమైన యుద్ధం చేస్తున్న రష్యాతో కలిసి ఇతర దేశాలు పాల్గొనటంపై అమెరికా ఆందోళన చెందుతున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరెన్‌ జిన్‌ పిర్రె పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొనాలా వద్దా అనేది ఆయాదేశాలే నిర్ణయం తీసుకోవాలని, తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: చైనాకు తైవాన్​ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకు డ్రాగన్ డ్రోన్లు పరార్!

రహస్య పత్రాల కేసులో ట్రంప్​కు మరిన్ని చిక్కులు

Russia Drills Ukraine: ఉక్రెయిన్‌పై సైనికచర్య జరుపుతున్న రష్యా.. మరోసారి మిత్రదేశాలు, మాజీ సోనియట్‌ దేశాలతో కలిసి ఇవాళ భారీఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభించనుంది. ఈ నెల ఏడో తేదీ వరకు వస్టాక్‌ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాల్లో భారత్‌, చైనా, లావోస్‌, మంగోలియా, నికరగ్వా, సిరియాతోపాటు మరికొన్ని మాజీ సోవియట్‌ దేశాలు పాల్గొంటాయని మాస్కో ప్రకటించింది.

వ్యూహాత్మక విన్యాసాల్లో 50వేల సైనికదళాలు, 5వేల కంటే ఎక్కువగా ఆయుధాలు, మిలిటరీ హార్డ్‌వేర్‌ ముఖ్యంగా 140యుద్ధవిమానాలు, 60 యుద్ధనౌకలు, గన్‌ బోట్లు, మద్దతు పడవలు పాల్గొంటాయి. సైనిక కమాండర్లలో నైపుణ్యాలు పెంచటానికి, సైనిక ప్రధాన కార్యాలయాలు ఆదేశాలు ఇవ్వటానికి, తూర్పు దిశతోపాటు తూర్పు సముద్ర ప్రాంతంలో దండయాత్రలను తిప్పికొట్టడం, తూర్పు ప్రాంతంలో మిలిటరీ రక్షణకు భరోసా, మిత్ర దేశాల ప్రయోజనాలను కాపాడటం, శాంతి పరిరక్షణ వంటి లక్ష్యాలను.. సంయుక్తంగా ఎదుర్కొనేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

వస్టాక్‌ సైనిక విన్యాసాల్లో పాల్గొనే భారత సైన్యం రోజూవారీ కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలను రష్యా సైన్యం విడుదల చేసింది. రష్యాలోని గుర్తు తెలియని ప్రాంతంలో భారత సైనికుల కవాతు, జవాన్లు వంట చేయటం, వారు పాటలు పాడుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. రష్యాకు చెందిన ఇతర బలగాలతోపాటు వైమానిక దళాలు, దీర్ఘశ్రేణి బాంబర్లు, మిలిటరీ రవాణా విమానాల ఈ విన్యాసాల్లో పాల్గొంటాయని మాస్కో రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా-చైనా నౌక దళాలు జపాన్‌ సముద్రంలో యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటాయని పేర్కొంది. సముద్ర సమాచార వ్యవస్థలు, సముద్ర ఆర్థిక వ్యవహారాలను కాపాడటంతోపాటు సముద్రతీర ప్రాంతాల్లో దళాలకు సాయం అందించటమే రష్యా-చైనా నౌకా విన్యాసాల లక్ష్యమని మాస్కో ప్రకటించింది.

గతేడాది జపాడ్‌ పేరుతో రష్యా నిర్వహించిన సైనిక విన్యాసాల్లో భారత్‌తోపాటు చైనా, పాకిస్థాన్‌లు పాల్గొన్నాయి. సైన్యం లేదా రక్షణ శాఖ కానీ స్పందించలేదు.అయితే ఈ సైనిక విన్యాసాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై కూర్రమైన యుద్ధం చేస్తున్న రష్యాతో కలిసి ఇతర దేశాలు పాల్గొనటంపై అమెరికా ఆందోళన చెందుతున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరెన్‌ జిన్‌ పిర్రె పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొనాలా వద్దా అనేది ఆయాదేశాలే నిర్ణయం తీసుకోవాలని, తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: చైనాకు తైవాన్​ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకు డ్రాగన్ డ్రోన్లు పరార్!

రహస్య పత్రాల కేసులో ట్రంప్​కు మరిన్ని చిక్కులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.