ETV Bharat / international

ఆసియా దాటిన కరోనా... ఫ్రాన్స్​లో తొలి మరణం

author img

By

Published : Feb 16, 2020, 12:01 AM IST

Updated : Mar 1, 2020, 11:59 AM IST

ప్రపంచదేశాల్ని వణికిస్తోన్న కరోనా​ ధాటికి ఫ్రాన్స్​లో ఓ వ్యక్తి మృతిచెందారు. ఇప్పటికే 1,500 మందికి పైగా చైనీయులను పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి ఇప్పుడు ఖండాలు దాటి తీవ్ర రూపం దాల్చుతోంది. కరోనా కారణంగా చైనాయేతర దేశాల్లో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందగా.. ఇప్పుడు ఆసియా ఆవల తొలి మరణం ఫ్రాన్స్​లో నమోదైంది.

France confirms first coronavirus death outside Asia
ఆసియా దాటిన కారోనా... ఫ్రాన్స్​లో తొలి మృతి

చైనాను గడగడలాడిస్తున్న కొవిడ్​-19(కరోనా వైరస్​) ధాటికి ఫ్రాన్స్​లో ఓ వ్యక్తి మృతిచెందారు. ఫ్రాన్స్​లో పర్యటించడానికి వచ్చిన ఓ 80ఏళ్ల చైనా వృద్ధురాలికి వైరస్​ సోకగా.. పారిస్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని ఆ దేశ​ ఆరోగ్య శాఖమంత్రి ఆగ్నెస్​ బుజిన్​ తెలిపారు. అదే ఆసుపత్రిలో మరో ఆరుగురు ఈ మహమ్మారి బారినపడినట్లు పేర్కొన్నారు. అందులో ఒకరు మృతురాలి కుమార్తె కాగా, మిగిలినవారు బ్రిటన్​కు చెందినవారని చెప్పారు.

చైనీయేతర దేశాల్లో 600మందికి పైగా...

గత డిసెంబర్​ నుంచి ప్రబలుతున్న కరోనా వైరస్​ కారణంగా.. చైనాలో రోజుకు వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా ఫిలిప్పీన్స్​, హాంగ్​కాంగ్​, జపాన్​ దేశాల్లోనూ ఒక్కొక్కరి చొప్పున కరోనా సోకి మరణించారు. చైనాయేతర దేశాల్లో 600 మందికి పైగా ఈ మహమ్మారి వ్యాప్తిచెందగా. అందులో జపాన్​ తీరంలోని క్రూయిజ్​షిప్​ ప్రయాణికుల్లోనే 285 మంది వరకూ ఉన్నారు. యూరప్​లోనే సుమారుగా 35 మందికి కరోనా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: వైద్యులపైనే కరోనా పంజా - చైనాలో ఆరుగురు మృతి

చైనాను గడగడలాడిస్తున్న కొవిడ్​-19(కరోనా వైరస్​) ధాటికి ఫ్రాన్స్​లో ఓ వ్యక్తి మృతిచెందారు. ఫ్రాన్స్​లో పర్యటించడానికి వచ్చిన ఓ 80ఏళ్ల చైనా వృద్ధురాలికి వైరస్​ సోకగా.. పారిస్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని ఆ దేశ​ ఆరోగ్య శాఖమంత్రి ఆగ్నెస్​ బుజిన్​ తెలిపారు. అదే ఆసుపత్రిలో మరో ఆరుగురు ఈ మహమ్మారి బారినపడినట్లు పేర్కొన్నారు. అందులో ఒకరు మృతురాలి కుమార్తె కాగా, మిగిలినవారు బ్రిటన్​కు చెందినవారని చెప్పారు.

చైనీయేతర దేశాల్లో 600మందికి పైగా...

గత డిసెంబర్​ నుంచి ప్రబలుతున్న కరోనా వైరస్​ కారణంగా.. చైనాలో రోజుకు వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా ఫిలిప్పీన్స్​, హాంగ్​కాంగ్​, జపాన్​ దేశాల్లోనూ ఒక్కొక్కరి చొప్పున కరోనా సోకి మరణించారు. చైనాయేతర దేశాల్లో 600 మందికి పైగా ఈ మహమ్మారి వ్యాప్తిచెందగా. అందులో జపాన్​ తీరంలోని క్రూయిజ్​షిప్​ ప్రయాణికుల్లోనే 285 మంది వరకూ ఉన్నారు. యూరప్​లోనే సుమారుగా 35 మందికి కరోనా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: వైద్యులపైనే కరోనా పంజా - చైనాలో ఆరుగురు మృతి

Last Updated : Mar 1, 2020, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.