ETV Bharat / international

స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీకి నేపాల్​ ప్రధాని ఫోన్!​

భారత 73వ స్వాతంత్య్రం దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఫోన్​ చేసి శుభాకాంక్షలు చెప్పనున్నారని సమాచారం. ఈ సందర్భంగా ధ్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని ఆ దేశ మీడియా చెబుతోంది.

author img

By

Published : Aug 13, 2020, 7:13 PM IST

Oli may call PM Modi on I-Day: Reports
స్వాతంత్ర్య దినోత్సవాన మోదీకి నేపాల్​ ప్రధాని ఫోన్!​

భారత్​తో నెలకొన్న విభేదాలను తగ్గించేందుకు నేపాల్​ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్​ చేయనున్నారని సమాచారం. 73వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీకి శుభాకాంక్షలు తెలిపి, ధ్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని..ఆ దేశ మీడియా వెల్లడించింది.

భారత్​లోని లిపులేఖ్​, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ ఇటీవల కొత్త మ్యాప్​ను రూపొందించి.. పార్లమెంటులో ఆమోదింపుజేసుకుంది ఓలీ ప్రభుత్వం. దాంతో ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తింది. నేపాల్​ నిర్ణయాన్ని భారత్​ ఖండించింది.

అంతకుముందు మే 8న ఉత్తరాఖండ్​లోని సరిహద్దు ప్రాంతాలైన లిపులేఖ్​, ధర్చులా ప్రాంతాల గుండా వెళ్లే 80 కిలోమీటర్ల రహదారిని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రారంభించారు. దీంతో భారత్​-నేపాల్​ మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఇదీ చూడండి: భారత్​-నేపాల్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం!

భారత్​తో నెలకొన్న విభేదాలను తగ్గించేందుకు నేపాల్​ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్​ చేయనున్నారని సమాచారం. 73వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీకి శుభాకాంక్షలు తెలిపి, ధ్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని..ఆ దేశ మీడియా వెల్లడించింది.

భారత్​లోని లిపులేఖ్​, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ ఇటీవల కొత్త మ్యాప్​ను రూపొందించి.. పార్లమెంటులో ఆమోదింపుజేసుకుంది ఓలీ ప్రభుత్వం. దాంతో ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తింది. నేపాల్​ నిర్ణయాన్ని భారత్​ ఖండించింది.

అంతకుముందు మే 8న ఉత్తరాఖండ్​లోని సరిహద్దు ప్రాంతాలైన లిపులేఖ్​, ధర్చులా ప్రాంతాల గుండా వెళ్లే 80 కిలోమీటర్ల రహదారిని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రారంభించారు. దీంతో భారత్​-నేపాల్​ మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఇదీ చూడండి: భారత్​-నేపాల్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.