ETV Bharat / international

'న్యూజిలాండ్‌ ఊపిరి పీల్చుకో.. నేనున్నాను'

author img

By

Published : Apr 14, 2020, 12:29 PM IST

కరోనా కల్లోలానికి అగ్రరాజ్యాలే ఉలికిపడుతున్న వేళ.. ‘న్యూజిలాండ్‌ ఊపిరి పీల్చుకో.. నేనున్నాను’ అంటున్నారు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌. ఆమె పాలనా దక్షత.. మహిళగా ముందుచూపు.. న్యూజిలాండ్‌కు కరోనా నుంచి రక్షణ కవచంగా మారాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలుచేస్తూనే.. అమ్మ మనసును చాటుకుంటున్నారామె!

NEWZEALAND PRIME MINISTER JACINDA ARDERN
న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌

ఫిబ్రవరి 28 న కరోనా న్యూజిలాండ్‌ తలుపుతట్టింది. ఇరాన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు వైరస్‌ సోకిందని తేలింది. అధికారులను రంగంలోకి దింపారు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌. విదేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు. అంతకు కొద్ది రోజుల ముందే విదేశాల నుంచి వచ్చిన వారిని వెనువెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా కరోనా జడలు విప్పకముందే.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

అందరి మద్దతుతో..

ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా తన పని తాను చేసుకుపోయింది. అవకాశం ఉన్న చోట విజృంభించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మరిన్ని చర్యలు తీసుకున్నారు జెసిండా. మార్చి 15 నుంచి పద్నాలుగు రోజుల పాటు ప్రజలంతా ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలని ఆదేశించారు. ఈ గడువు ముగియకముందే మార్చి 26 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆమె నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు పలికారు. లాక్‌డౌన్‌ను పక్కాగా పాటిస్తున్నారు. అప్పటి నుంచి కేసుల తీవ్రత తగ్గింది. వైరస్‌ వ్యాప్తి ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారామె. కరోనా పీడిత ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లుగా విభజించి పరిస్థితులు చేజారకుండా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసేలా చూస్తున్నారు.

తగ్గుముఖం పట్టిన వైరస్‌

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా.. నిత్యావసరాలకు కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు జెసిండా. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించడం వల్ల న్యూజిలాండ్‌లో వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టింది. వీలైనంతమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయడం వల్లే ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోగలిగామని చెబుతున్నారామె. న్యూజిలాండ్‌లో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 1,349. సుమారు 471 మంది పూర్తిగా కోలుకున్నారు. నలుగురే మృతి చెందారు. కేసుల పెరుగుదల కూడా స్వల్పంగానే ఉంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ఆమె తీసుకున్న చర్యలు ఇప్పుడు మెరుగైన ఫలితాన్నిస్తున్నాయి.

అమ్మ మనసు..

గతంలో ఐక్యరాజ్యసమితి సమావేశానికి తన బిడ్డతో హాజరై తల్లి మనసును చాటుకున్న ఆమె.. ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. అత్యవసర వస్తువులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటిలో పిల్లల సాహిత్యానికీ చోటిచ్చారు. కామిక్‌ పుస్తకాలు, కథల పుస్తకాలు, పిల్లల మేధస్సును పెంచే పుస్తకాలను అందుబాటులో ఉంచి.. అందరి మన్ననలూ అందుకుంటున్నారు.

ఇదీ చదవండి: కరోనా కొమ్ముల్ని వంచిన దేశాలు ఇవే...

ఫిబ్రవరి 28 న కరోనా న్యూజిలాండ్‌ తలుపుతట్టింది. ఇరాన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు వైరస్‌ సోకిందని తేలింది. అధికారులను రంగంలోకి దింపారు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌. విదేశాల నుంచి వచ్చిన వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నారు. అంతకు కొద్ది రోజుల ముందే విదేశాల నుంచి వచ్చిన వారిని వెనువెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా కరోనా జడలు విప్పకముందే.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

అందరి మద్దతుతో..

ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కరోనా తన పని తాను చేసుకుపోయింది. అవకాశం ఉన్న చోట విజృంభించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మరిన్ని చర్యలు తీసుకున్నారు జెసిండా. మార్చి 15 నుంచి పద్నాలుగు రోజుల పాటు ప్రజలంతా ఎవరి ఇళ్లకు వారు పరిమితం కావాలని ఆదేశించారు. ఈ గడువు ముగియకముందే మార్చి 26 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఆమె నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు పలికారు. లాక్‌డౌన్‌ను పక్కాగా పాటిస్తున్నారు. అప్పటి నుంచి కేసుల తీవ్రత తగ్గింది. వైరస్‌ వ్యాప్తి ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారామె. కరోనా పీడిత ప్రాంతాలను ప్రత్యేక క్లస్టర్లుగా విభజించి పరిస్థితులు చేజారకుండా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసేలా చూస్తున్నారు.

తగ్గుముఖం పట్టిన వైరస్‌

లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నా.. నిత్యావసరాలకు కొరత లేకుండా ఏర్పాట్లు చేశారు జెసిండా. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించడం వల్ల న్యూజిలాండ్‌లో వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టింది. వీలైనంతమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయడం వల్లే ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోగలిగామని చెబుతున్నారామె. న్యూజిలాండ్‌లో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య 1,349. సుమారు 471 మంది పూర్తిగా కోలుకున్నారు. నలుగురే మృతి చెందారు. కేసుల పెరుగుదల కూడా స్వల్పంగానే ఉంది. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ఆమె తీసుకున్న చర్యలు ఇప్పుడు మెరుగైన ఫలితాన్నిస్తున్నాయి.

అమ్మ మనసు..

గతంలో ఐక్యరాజ్యసమితి సమావేశానికి తన బిడ్డతో హాజరై తల్లి మనసును చాటుకున్న ఆమె.. ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. అత్యవసర వస్తువులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటిలో పిల్లల సాహిత్యానికీ చోటిచ్చారు. కామిక్‌ పుస్తకాలు, కథల పుస్తకాలు, పిల్లల మేధస్సును పెంచే పుస్తకాలను అందుబాటులో ఉంచి.. అందరి మన్ననలూ అందుకుంటున్నారు.

ఇదీ చదవండి: కరోనా కొమ్ముల్ని వంచిన దేశాలు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.