ETV Bharat / international

'భారత్​పై ఫిర్యాదు చేసినందుకే నాపై ట్రంప్ వేటు'

author img

By

Published : May 6, 2020, 1:04 PM IST

Updated : May 6, 2020, 2:12 PM IST

కరోనా మహమ్మారి, హైడ్రాక్సీక్లోరోక్విన్ వినియోగంపై పలు మార్లు చేసిన హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఓ శాస్త్రవేత్త ఆరోపించారు. మలేరియా మందు వాడకాన్ని వ్యతిరేకించినందుకే తనను, తన సహచరులను విధుల నుంచి తప్పించారంటూ ఫిర్యాదు చేశారు.

Trump
'భారత్​పై ఫిర్యాదు చేసినందుకే నాపై ట్రంప్ వేటు'

కరోనా వైరస్ సహా భారత్, పాకిస్థాన్ నుంచి వచ్చే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం నాణ్యతపై పలు మార్లు చేసిన హెచ్చరికలను అమెరికా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఇటీవల విధుల నుంచి ఉద్వాసనకు గురైన ఓ శాస్త్రవేత్త ఆరోపించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అధికారుల కారణంగానే దేశంలో వైరస్ విజృంభించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజావేగుల రక్షణకు ఉద్దేశించిన అమెరికా ప్రత్యేక కౌన్సెల్ కార్యాలయంలో మంగళవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు డా. రిక్ బ్రైట్. ఆరోగ్య, మానవ సేవల విభాగం(హెచ్​హెచ్​ఎస్​) ఉన్నతాధికారులు, ఔషధాల నాణ్యతను చూసే అధికారులు.. తాను పలు మార్లు చేసిన హెచ్చరికలను విస్మరించారని అందులో పేర్కొన్నారు.

విధుల నుంచి తొలగించకముందు.. హెచ్​హెచ్​ఎస్​లోని ‘జీవవైద్యశాస్త్ర ఆధునిక పరిశోధన, అభివృద్ధి సంస్థ’కు నేతృత్వం వహించారు బ్రైట్.

పాకిస్థాన్, భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఔషధాలపై ఇప్పటికీ ఆందోళన చెందుతున్నా. ఆ డ్రగ్, వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలను ఎఫ్​డీఏ తనిఖీ చేయలేదు. తనిఖీ చేయని పరిశ్రమల నుంచి వచ్చే ఔషధాలు కలుషితంగా, సరైన మోతాదులో ఉండకపోవచ్చు. వాటిని వినియోగిస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. ప్రమాదకరమని తెలిసినా డా.కాడ్లెక్ సహా ఇతర అధికారులు పట్టించుకోలేదు. ఈ డ్రగ్​ను ఎక్కువ వినియోగించేందుకు ప్రయత్నించారు.

- డా. రిక్ బ్రైట్, అమెరికా శాస్త్రవేత్త

అదొక్కటే మార్గం...

ప్రమాదకరమైన మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని తగ్గించేందుకు తన బృందంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంత ప్రయత్నించినా.. ఏ ఒక్కరు సాయం చేయలేదని ఆరోపించారు డా.బ్రైట్. ఈ ఔషధంతో సమస్యలు, కలిగే ప్రమాదాన్ని అర్థం చేసుకున్న పాత్రికేయులతోనే తన ఆవేదనను పంచుకోవటం ఒక్కటే మార్గమమని తుది నిర్ణయానికి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వ్యతిరేకించినందుకే..

అతి తక్కువ శాస్త్రీయ ఆధారాలతో, తక్కువ సమయంలోనే హెడ్రాక్సీక్లోరోక్విన్​ను దేశవ్యాప్తంగా వినియోగించేందుకు హెచ్​హెచ్​ఎస్​ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు బ్రైట్. ఈ ఔషధం వినియోగాన్ని వ్యతిరేకించినందుకే తనను, తన సహచరులను విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు.

కరోనా వైరస్ సహా భారత్, పాకిస్థాన్ నుంచి వచ్చే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం నాణ్యతపై పలు మార్లు చేసిన హెచ్చరికలను అమెరికా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఇటీవల విధుల నుంచి ఉద్వాసనకు గురైన ఓ శాస్త్రవేత్త ఆరోపించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అధికారుల కారణంగానే దేశంలో వైరస్ విజృంభించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజావేగుల రక్షణకు ఉద్దేశించిన అమెరికా ప్రత్యేక కౌన్సెల్ కార్యాలయంలో మంగళవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు డా. రిక్ బ్రైట్. ఆరోగ్య, మానవ సేవల విభాగం(హెచ్​హెచ్​ఎస్​) ఉన్నతాధికారులు, ఔషధాల నాణ్యతను చూసే అధికారులు.. తాను పలు మార్లు చేసిన హెచ్చరికలను విస్మరించారని అందులో పేర్కొన్నారు.

విధుల నుంచి తొలగించకముందు.. హెచ్​హెచ్​ఎస్​లోని ‘జీవవైద్యశాస్త్ర ఆధునిక పరిశోధన, అభివృద్ధి సంస్థ’కు నేతృత్వం వహించారు బ్రైట్.

పాకిస్థాన్, భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఔషధాలపై ఇప్పటికీ ఆందోళన చెందుతున్నా. ఆ డ్రగ్, వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలను ఎఫ్​డీఏ తనిఖీ చేయలేదు. తనిఖీ చేయని పరిశ్రమల నుంచి వచ్చే ఔషధాలు కలుషితంగా, సరైన మోతాదులో ఉండకపోవచ్చు. వాటిని వినియోగిస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. ప్రమాదకరమని తెలిసినా డా.కాడ్లెక్ సహా ఇతర అధికారులు పట్టించుకోలేదు. ఈ డ్రగ్​ను ఎక్కువ వినియోగించేందుకు ప్రయత్నించారు.

- డా. రిక్ బ్రైట్, అమెరికా శాస్త్రవేత్త

అదొక్కటే మార్గం...

ప్రమాదకరమైన మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని తగ్గించేందుకు తన బృందంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంత ప్రయత్నించినా.. ఏ ఒక్కరు సాయం చేయలేదని ఆరోపించారు డా.బ్రైట్. ఈ ఔషధంతో సమస్యలు, కలిగే ప్రమాదాన్ని అర్థం చేసుకున్న పాత్రికేయులతోనే తన ఆవేదనను పంచుకోవటం ఒక్కటే మార్గమమని తుది నిర్ణయానికి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వ్యతిరేకించినందుకే..

అతి తక్కువ శాస్త్రీయ ఆధారాలతో, తక్కువ సమయంలోనే హెడ్రాక్సీక్లోరోక్విన్​ను దేశవ్యాప్తంగా వినియోగించేందుకు హెచ్​హెచ్​ఎస్​ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు బ్రైట్. ఈ ఔషధం వినియోగాన్ని వ్యతిరేకించినందుకే తనను, తన సహచరులను విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు.

Last Updated : May 6, 2020, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.