ETV Bharat / international

జిత్తులమారి కరోనాపై శాస్త్రవేత్తల మరో ముందడుగు

author img

By

Published : Jul 27, 2020, 5:52 AM IST

మనిషి శరీరంలో కరోనా తీరుపై శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని కనుగొన్నారు. మానవ కణాన్ని ఏమార్చే తీరును గుర్తించారు. కొవిడ్‌-19 చికిత్స కోసం కొత్త రకం యాంటీవైరల్‌ ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుంది.

scientists-found-to-deceive-the-human-cell-coronavirus
జిత్తులమారి కరోనాపై శాస్త్రవేత్తల మరో ముందడుగు

మానవ రోగ నిరోధక వ్యవస్థను కరోనా వైరస్‌ బోల్తా కొట్టిస్తున్న తీరును అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వైరస్‌ జన్యుక్రమం.. మన శరీరంలో అంతర్భాగమేనని భ్రమింపచేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక ఎంజైమ్‌ను వారు గుర్తించారు. దాని నిర్మాణాన్ని వారు వెలుగులోకి తెచ్చారు. ఈ బృందానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త యోగేశ్‌ గుప్తా నేతృత్వం వహించారు. కొవిడ్‌-19 చికిత్స కోసం కొత్త రకం యాంటీవైరల్‌ ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుంది.

రోగ నిరోధక ప్రతిస్పందన

ఎన్‌ఎస్‌పీ-10 అనే ప్రొటీన్‌.. వైరల్‌ ఎంఆర్‌ఎన్‌ఏల (ప్రొటీన్ల ఉత్పత్తి కేంద్రాలకు జన్యుకోడ్‌లను పంపే వ్యవస్థ)లకు మార్పు చేసి, అవి మానవ ఎంఆర్‌ఎన్‌ఏలా కనిపించేలా చూస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మార్పు ద్వారా మానవ రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన నుంచి వైరస్‌ను రక్షిస్తుందని చెప్పారు.

"ఎన్‌ఎస్‌పీ-10 ప్రయోగించే ఈ కిటుకు వల్ల మానవ కణం బోల్తా పడుతుంది. ఫలితంగా వైరస్‌కు సంబంధించిన ఎంఆర్‌ఎన్‌ఏ.. పరాయిది కాదు, సొంతదేనని నమ్ముతుంది"

-యోగేశ్‌ గుప్తా, శాస్త్రవేత్త

ఎన్‌ఎస్‌పీ-10.. ఎన్‌ఎస్‌పీ-16 అనే మరో ఎంజైమ్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌పీ-16కు సంబంధించిన త్రీడీ నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనివల్ల.. వైరల్‌ ఎంఆర్‌ఎన్‌ఏలో మార్పులు చేయకుండా ఎన్‌ఎస్‌పీ-16ను నిలువరించేలా కొత్త ఔషధాల రూపకల్పనకు వీలు కలుగుతుందని వారు తెలిపారు. ఈ పరిశోధన ఆధారంగా ఎన్‌ఎస్‌పీ-10లో.. ఔషధాలు లక్ష్యంగా చేసుకోదగ్గ భాగాలనూ శాస్త్రవేత్తలు గుర్తించారు.

మానవ రోగ నిరోధక వ్యవస్థను కరోనా వైరస్‌ బోల్తా కొట్టిస్తున్న తీరును అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వైరస్‌ జన్యుక్రమం.. మన శరీరంలో అంతర్భాగమేనని భ్రమింపచేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక ఎంజైమ్‌ను వారు గుర్తించారు. దాని నిర్మాణాన్ని వారు వెలుగులోకి తెచ్చారు. ఈ బృందానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త యోగేశ్‌ గుప్తా నేతృత్వం వహించారు. కొవిడ్‌-19 చికిత్స కోసం కొత్త రకం యాంటీవైరల్‌ ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుంది.

రోగ నిరోధక ప్రతిస్పందన

ఎన్‌ఎస్‌పీ-10 అనే ప్రొటీన్‌.. వైరల్‌ ఎంఆర్‌ఎన్‌ఏల (ప్రొటీన్ల ఉత్పత్తి కేంద్రాలకు జన్యుకోడ్‌లను పంపే వ్యవస్థ)లకు మార్పు చేసి, అవి మానవ ఎంఆర్‌ఎన్‌ఏలా కనిపించేలా చూస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మార్పు ద్వారా మానవ రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన నుంచి వైరస్‌ను రక్షిస్తుందని చెప్పారు.

"ఎన్‌ఎస్‌పీ-10 ప్రయోగించే ఈ కిటుకు వల్ల మానవ కణం బోల్తా పడుతుంది. ఫలితంగా వైరస్‌కు సంబంధించిన ఎంఆర్‌ఎన్‌ఏ.. పరాయిది కాదు, సొంతదేనని నమ్ముతుంది"

-యోగేశ్‌ గుప్తా, శాస్త్రవేత్త

ఎన్‌ఎస్‌పీ-10.. ఎన్‌ఎస్‌పీ-16 అనే మరో ఎంజైమ్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌పీ-16కు సంబంధించిన త్రీడీ నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనివల్ల.. వైరల్‌ ఎంఆర్‌ఎన్‌ఏలో మార్పులు చేయకుండా ఎన్‌ఎస్‌పీ-16ను నిలువరించేలా కొత్త ఔషధాల రూపకల్పనకు వీలు కలుగుతుందని వారు తెలిపారు. ఈ పరిశోధన ఆధారంగా ఎన్‌ఎస్‌పీ-10లో.. ఔషధాలు లక్ష్యంగా చేసుకోదగ్గ భాగాలనూ శాస్త్రవేత్తలు గుర్తించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.