ETV Bharat / entertainment

''గాడ్​ ఫాదర్'​లో పది సర్​ప్రైజ్​లు!.. త్వరలోనే నాగ్​-అఖిల్​తో యాక్షన్​ మల్టీస్టారర్​!'

author img

By

Published : Oct 4, 2022, 6:35 AM IST

'హనుమాన్‌ జంక్షన్‌' చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు మోహన్‌రాజా. తర్వాత పూర్తిగా తమిళ చిత్రసీమకే పరిమితమైన ఆయన.. అక్కడ రీమేక్‌ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. 21 ఏళ్ల విరామం తర్వాత 'గాడ్‌ఫాదర్‌'తో తిరిగి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

god father movie director mohanraja interview
god father movie director mohanraja interview

'హనుమాన్‌ జంక్షన్‌' చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు మోహన్‌రాజా. తర్వాత పూర్తిగా తమిళ చిత్రసీమకే పరిమితమైన ఆయన.. అక్కడ రీమేక్‌ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. 21 ఏళ్ల విరామం తర్వాత 'గాడ్‌ఫాదర్‌'తో తిరిగి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మలయాళంలో విజయవంతమైన 'లూసీఫర్‌'కు ఇది రీమేక్‌. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బుధవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం విలేకర్లతో పలు విషయాలను ముచ్చటించారు మోహన్‌రాజా. ఆ విశేషాలివి..

''ధృవ' సినిమా నుంచి నాకూ చరణ్‌కి పరిచయం. 'ధృవ 2' స్క్రిప్ట్‌ గురించి చర్చలు జరుపుతున్న సమయంలో 'లూసీఫర్‌' ప్రస్తావన వచ్చింది. నిర్మాత ఎన్వీప్రసాద్‌ దర్శకుడిగా నా పేరు సూచించారు. అది చరణ్‌, చిరంజీవికి నచ్చింది. ఓరోజు ఆయన ఫోన్‌ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే 'లూసీఫర్‌'ని చూశా. అందులో నాకు ఓ కొత్త కోణం దొరికింది. దాన్నే నేను చిరంజీవితో పంచుకున్నా. అది నచ్చడంతో 'గాడ్‌ఫాదర్‌' పనులు మొదలయ్యాయి. 'గాడ్‌ ఫాదర్‌' స్క్రీన్‌ప్లే కొత్తగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలూ గెలుస్తాయి. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఇవన్నీ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. ఓపిక ఉంటే 'లూసీఫర్‌'ని మరోసారి చూసి రండి (నవ్వుతూ). ఈ చిత్రాన్ని నేను పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కంటే ఎక్కువ ప్రేమించాను. ఇందులో ప్లస్‌లు.. మైనస్‌లు నాకే బాగా తెలుసు''.

-- మోహన్​రాజా, దర్శకుడు

''చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ లాంటి ఇద్దరు మెగాస్టార్లను డైరెక్ట్‌ చేయడం సులువైన విషయం కాదు. చాలా ఒత్తిడి ఉంటుంది. చిరు ఆ ఒత్తిడిని తీసేశారు. సెట్లో ఆయనిచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సల్మాన్‌ సెట్‌లో కూల్‌గా ఉంటారు. చిరుపై ఆయనకున్న ప్రేమతో ఈ చిత్రం చేశారాయన. 'గాడ్‌ఫాదర్‌'కు సీక్వెల్‌ చేసే స్కోప్‌ ఉంది. 'ధృవ 2' చేయాలన్న ఆలోచన ఉంది. అయితే ఇదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి. తెలుగులో నాగార్జున - అఖిల్‌తో ఓ స్టైలిష్‌ యాక్షన్‌ సినిమా చేయనున్నా. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తా. 21ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడులో పుట్టినా.. దర్శకుడిగా జన్మనిచ్చింది తెలుగు చిత్రసీమే. ఇన్నేళ్లు తెలుగు తెరకు దూరంగా ఉన్నా.. ఆ భావన నాలో ఏమాత్రం లేదు. వరుసగా ఆరు తెలుగు చిత్రాల్ని తమిళంలో రీమేక్‌ చేశా. అందుకే ఈ ప్రాంతంతో ఎప్పుడూ దగ్గరగా ఉన్నట్లే ఉంటుంది'' అంటూ మోహన్​రాజా చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి:ఆ స్టార్‌హీరో సినిమాతో డబ్బు పోగొట్టుకున్నా: నాగవంశీ.

God Father: 'గాడ్‌ ఫాదర్‌' నుంచి మరో సర్​ప్రైజ్​.. టైటిల్​ సాంగ్ రిలీజ్

'హనుమాన్‌ జంక్షన్‌' చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు మోహన్‌రాజా. తర్వాత పూర్తిగా తమిళ చిత్రసీమకే పరిమితమైన ఆయన.. అక్కడ రీమేక్‌ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. 21 ఏళ్ల విరామం తర్వాత 'గాడ్‌ఫాదర్‌'తో తిరిగి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మలయాళంలో విజయవంతమైన 'లూసీఫర్‌'కు ఇది రీమేక్‌. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బుధవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం విలేకర్లతో పలు విషయాలను ముచ్చటించారు మోహన్‌రాజా. ఆ విశేషాలివి..

''ధృవ' సినిమా నుంచి నాకూ చరణ్‌కి పరిచయం. 'ధృవ 2' స్క్రిప్ట్‌ గురించి చర్చలు జరుపుతున్న సమయంలో 'లూసీఫర్‌' ప్రస్తావన వచ్చింది. నిర్మాత ఎన్వీప్రసాద్‌ దర్శకుడిగా నా పేరు సూచించారు. అది చరణ్‌, చిరంజీవికి నచ్చింది. ఓరోజు ఆయన ఫోన్‌ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే 'లూసీఫర్‌'ని చూశా. అందులో నాకు ఓ కొత్త కోణం దొరికింది. దాన్నే నేను చిరంజీవితో పంచుకున్నా. అది నచ్చడంతో 'గాడ్‌ఫాదర్‌' పనులు మొదలయ్యాయి. 'గాడ్‌ ఫాదర్‌' స్క్రీన్‌ప్లే కొత్తగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలూ గెలుస్తాయి. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఇవన్నీ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. ఓపిక ఉంటే 'లూసీఫర్‌'ని మరోసారి చూసి రండి (నవ్వుతూ). ఈ చిత్రాన్ని నేను పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కంటే ఎక్కువ ప్రేమించాను. ఇందులో ప్లస్‌లు.. మైనస్‌లు నాకే బాగా తెలుసు''.

-- మోహన్​రాజా, దర్శకుడు

''చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ లాంటి ఇద్దరు మెగాస్టార్లను డైరెక్ట్‌ చేయడం సులువైన విషయం కాదు. చాలా ఒత్తిడి ఉంటుంది. చిరు ఆ ఒత్తిడిని తీసేశారు. సెట్లో ఆయనిచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సల్మాన్‌ సెట్‌లో కూల్‌గా ఉంటారు. చిరుపై ఆయనకున్న ప్రేమతో ఈ చిత్రం చేశారాయన. 'గాడ్‌ఫాదర్‌'కు సీక్వెల్‌ చేసే స్కోప్‌ ఉంది. 'ధృవ 2' చేయాలన్న ఆలోచన ఉంది. అయితే ఇదెప్పుడు సాధ్యమవుతుందో చూడాలి. తెలుగులో నాగార్జున - అఖిల్‌తో ఓ స్టైలిష్‌ యాక్షన్‌ సినిమా చేయనున్నా. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తా. 21ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తమిళనాడులో పుట్టినా.. దర్శకుడిగా జన్మనిచ్చింది తెలుగు చిత్రసీమే. ఇన్నేళ్లు తెలుగు తెరకు దూరంగా ఉన్నా.. ఆ భావన నాలో ఏమాత్రం లేదు. వరుసగా ఆరు తెలుగు చిత్రాల్ని తమిళంలో రీమేక్‌ చేశా. అందుకే ఈ ప్రాంతంతో ఎప్పుడూ దగ్గరగా ఉన్నట్లే ఉంటుంది'' అంటూ మోహన్​రాజా చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి:ఆ స్టార్‌హీరో సినిమాతో డబ్బు పోగొట్టుకున్నా: నాగవంశీ.

God Father: 'గాడ్‌ ఫాదర్‌' నుంచి మరో సర్​ప్రైజ్​.. టైటిల్​ సాంగ్ రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.