ETV Bharat / entertainment

'బాహుబలి'లో ఆ రెండు పాటలకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?

author img

By

Published : Oct 1, 2022, 6:20 PM IST

ప్రభాస్​-రానా నటించిన బాహుబలి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. రిలీజై ఇన్నేళ్లైనా ఇప్పటికీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే..

bahubali
బాహుబలి

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సిరీస్​ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. తెలుగు చిత్రసీమ స్థాయిని.. భారతీయ సినిమాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యాలు.. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకున్నాయి. దాదాపు రూ.2 వేల కోట్ల వ‌ర‌కు కలెక్షన్లను సాధించాయి.

సినిమా విడుదలై ఇన్నేళ్లైనా ఈ మూవీ గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా ఈ మూవీలోని రెండు పాట‌లకు చెందిన వివ‌రాలు వైర‌ల్ అవుతున్నాయి. అవి తెరకెక్కించడానికి ఎంత ఖర్చు అయిందో తెలిసింది. తొలి భాగంలో అవంతిక‌ను(తమన్నా) వెతుకుతూ శివుడు అలియాస్ మ‌హేంద్ర బాహుబ‌లి(ప్రభాస్​) వెళ్తారు. ఆ స‌మ‌యంలో ధీవరా గీతం వ‌స్తుంది. ఆ త‌ర్వాత హీరో హీరోయిన్ ప్రేమలో పడ్డాక పచ్చబొట్టేసిన పాట వ‌స్తుంది. అయితే ఈ పాట‌ల‌కు చెందిన బ‌డ్జెట్ వివ‌రాలే తెలిశాయి. ఈ రెండు పాట‌ల‌కు ఒక్కో దానికి రూ.2.50 కోట్ల చొప్పున రూ.5 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. అత్యంత అద్భుత‌మైన గ్రాఫిక్స్​తో వీటిని రూపొందించారు. ఇవి అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, ఈ చిత్రంలో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యంతో అల‌రించారు. అలాగే భ‌ల్లాల దేవుడి పాత్ర‌లో రాణా ఆకట్టుకున్నారు. ఇక అనుష్క శెట్టి, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, కిచ్చ సుదీప్, సత్యరాజ్​ కీలక పాత్రల్లో అద్భుతంగా న‌టించారు. ఈ చిత్రాలు ఈ నటులందరికీ పాన్ ఇండియా రేంజ్​లో స్టార్ స్టేటస్​ను తీసుకొచ్చాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: బాలయ్య 'అన్​స్టాపబుల్​ 2' ట్రైలర్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సిరీస్​ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. తెలుగు చిత్రసీమ స్థాయిని.. భారతీయ సినిమాల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యాలు.. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు అందుకున్నాయి. దాదాపు రూ.2 వేల కోట్ల వ‌ర‌కు కలెక్షన్లను సాధించాయి.

సినిమా విడుదలై ఇన్నేళ్లైనా ఈ మూవీ గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా ఈ మూవీలోని రెండు పాట‌లకు చెందిన వివ‌రాలు వైర‌ల్ అవుతున్నాయి. అవి తెరకెక్కించడానికి ఎంత ఖర్చు అయిందో తెలిసింది. తొలి భాగంలో అవంతిక‌ను(తమన్నా) వెతుకుతూ శివుడు అలియాస్ మ‌హేంద్ర బాహుబ‌లి(ప్రభాస్​) వెళ్తారు. ఆ స‌మ‌యంలో ధీవరా గీతం వ‌స్తుంది. ఆ త‌ర్వాత హీరో హీరోయిన్ ప్రేమలో పడ్డాక పచ్చబొట్టేసిన పాట వ‌స్తుంది. అయితే ఈ పాట‌ల‌కు చెందిన బ‌డ్జెట్ వివ‌రాలే తెలిశాయి. ఈ రెండు పాట‌ల‌కు ఒక్కో దానికి రూ.2.50 కోట్ల చొప్పున రూ.5 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. అత్యంత అద్భుత‌మైన గ్రాఫిక్స్​తో వీటిని రూపొందించారు. ఇవి అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, ఈ చిత్రంలో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యంతో అల‌రించారు. అలాగే భ‌ల్లాల దేవుడి పాత్ర‌లో రాణా ఆకట్టుకున్నారు. ఇక అనుష్క శెట్టి, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్‌, కిచ్చ సుదీప్, సత్యరాజ్​ కీలక పాత్రల్లో అద్భుతంగా న‌టించారు. ఈ చిత్రాలు ఈ నటులందరికీ పాన్ ఇండియా రేంజ్​లో స్టార్ స్టేటస్​ను తీసుకొచ్చాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: బాలయ్య 'అన్​స్టాపబుల్​ 2' ట్రైలర్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.