ETV Bharat / crime

Short-circuit: విద్యుదాఘాతంతో ఇద్దరు గొర్రెల కాపరులు మృతి

author img

By

Published : Aug 28, 2021, 5:10 PM IST

Updated : Aug 28, 2021, 7:24 PM IST

short circuit
short circuit

17:04 August 28

పొలానికి రక్షణగా కరెంటుతీగలు పెట్టిన య‌జ‌మాని

పంట రక్షణకోసం పొలంలో ఏర్పాటు చేసిన కరెంటుతీగలు.. గొర్రెల కాపరుల పాలిట యమపాశంగా మారింది. పందులు రాకుండా వేరుశ‌న‌గ పొలం చుట్టూ పెట్టిన కరెంటు తీగలు తగిలి.. విద్యుదాఘాతంతో ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. ఈ ఘటన క‌డ‌ప‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం నంగ‌నూరుప‌ల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన రామ‌ల‌క్ష్మమ్మ‌, ద‌స్త‌గిరిల‌కు గొర్రెలు ఉన్నాయి.

ప్ర‌తి రోజూ వాటిని మేపేందుకు అడవిలోకి తీసుకెళ్తుంటారు. రోజులాగే ఇవాళా గొర్రెలు మేపేందుకు వెళ్లిన ఆ ఇద్ద‌రు ప్ర‌మాద‌వశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ప్ర‌మాదంలో నాలుగు గొర్రెలు, శున‌కం కూడా చనిపోయాయి. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు.

ఇదీ చదవండి:

BABY MISSING: మార్కాపురం జిల్లా వైద్యశాలలో పసికందు అదృశ్యం

Accident: ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. నిద్రలోనే తండ్రి, కుమారుడు మృతి

17:04 August 28

పొలానికి రక్షణగా కరెంటుతీగలు పెట్టిన య‌జ‌మాని

పంట రక్షణకోసం పొలంలో ఏర్పాటు చేసిన కరెంటుతీగలు.. గొర్రెల కాపరుల పాలిట యమపాశంగా మారింది. పందులు రాకుండా వేరుశ‌న‌గ పొలం చుట్టూ పెట్టిన కరెంటు తీగలు తగిలి.. విద్యుదాఘాతంతో ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. ఈ ఘటన క‌డ‌ప‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం నంగ‌నూరుప‌ల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన రామ‌ల‌క్ష్మమ్మ‌, ద‌స్త‌గిరిల‌కు గొర్రెలు ఉన్నాయి.

ప్ర‌తి రోజూ వాటిని మేపేందుకు అడవిలోకి తీసుకెళ్తుంటారు. రోజులాగే ఇవాళా గొర్రెలు మేపేందుకు వెళ్లిన ఆ ఇద్ద‌రు ప్ర‌మాద‌వశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ప్ర‌మాదంలో నాలుగు గొర్రెలు, శున‌కం కూడా చనిపోయాయి. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు.

ఇదీ చదవండి:

BABY MISSING: మార్కాపురం జిల్లా వైద్యశాలలో పసికందు అదృశ్యం

Accident: ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. నిద్రలోనే తండ్రి, కుమారుడు మృతి

Last Updated : Aug 28, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.