ETV Bharat / crime

కృష్ణాజిల్లా సీఐటీయూ నాయకురాలు ఆత్మహత్య... అధికార పార్టీ నేత వేధింపులే కారణం?

author img

By

Published : Mar 17, 2022, 5:38 PM IST

CITU leader suicide: కృష్ణాజిల్లాకు చెందిన సీఐటీయూ నాయకురాలు గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. డ్వాక్రా గ్రూపుల రుణాల విషయంలో.. గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత వేధింపుల కారణంగానే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

CITU leader suicide
CITU leader suicide

CITU leader suicide: కృష్ణాజిల్లాకు చెందిన సీఐటీయూ నాయకురాలు గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి వీఓఏల సంఘం మండల అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. డ్వాక్రా గ్రూపుల రుణాల విషయంలో.. గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత వేధింపులు కారణంగానే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగలక్ష్మి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మాసుం బాషా తెలిపారు.

డ్వాక్రా గ్రూపు రుణాల విషయంలో గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళతో ఏర్పడిన వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోందని.. అధికార పార్టీ నేతల వేధింపులు లేవని డీఎస్పీ తెలిపారు. కేసు విచారణ జరిపి బాధ్యులను అరెస్ట్ చేస్తామన్నారు. కాగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నాగలక్ష్మి భౌతికకాయాన్ని మంత్రి పేర్ని నాని తనయుడు, వైసీపీ నేత పేర్ని కిట్టు, మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు.

CITU leader suicide: కృష్ణాజిల్లాకు చెందిన సీఐటీయూ నాయకురాలు గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగలక్ష్మి వీఓఏల సంఘం మండల అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. డ్వాక్రా గ్రూపుల రుణాల విషయంలో.. గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత వేధింపులు కారణంగానే నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నాగలక్ష్మి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మాసుం బాషా తెలిపారు.

డ్వాక్రా గ్రూపు రుణాల విషయంలో గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళతో ఏర్పడిన వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోందని.. అధికార పార్టీ నేతల వేధింపులు లేవని డీఎస్పీ తెలిపారు. కేసు విచారణ జరిపి బాధ్యులను అరెస్ట్ చేస్తామన్నారు. కాగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నాగలక్ష్మి భౌతికకాయాన్ని మంత్రి పేర్ని నాని తనయుడు, వైసీపీ నేత పేర్ని కిట్టు, మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ జడ్పీటీసీ లంకే వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: Dowry Harassment: వరకట్న వేధింపులతో బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.