Elephants attack in komarada: విజయనగరం జిల్లా కోమరాడ మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అర్ధరాత్రి గంగిరేగి వలసలో నిద్రిస్తున్న ఆవులపై దాడి చేశాయి. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి. అర్ధరాత్రి ఏనుగు దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనతో పరుగులు తీశారు.
అధికారులు వెంటనే స్పందించి... తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. మృతి చెందిన ఆవులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Accident: కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ఊహించని విషాదం !