ETV Bharat / crime

Road Accident: పెళ్లి పారాణి ఆరకముందే.. విగతజీవిగా

author img

By

Published : Aug 28, 2021, 1:45 PM IST

ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆమె ఆశలు సమాధయ్యాయి. పెళ్లి పారాణి ఆరకముందే.. ఆమె విగతజీవిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుతోనే ఆ తండ్రీ అనంతలోకాలకు పయనమయ్యాడు. పెళ్లింట విషాదం రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లా పాత మద్ధిపడగలో చోటు చేసుకుంది.

Road Accident
Road Accident

తెలంగాణలోని నిర్మల్ జిల్లా పాత మద్ధిపడగలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నవవధువు ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన కొన్నిరోజులే ఆమెకు నిండునూరేళ్లు నిండాయి. అంతసేపు ఆనందంలో మునిగితేలిన ఆ కుటుంబాల్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బాజాలతో మోర్మోగిన ఆ లోగిలి కన్నీటి సంద్రమైంది. కొత్త జీవితాన్ని ప్రారంభించకుండానే.. ఆ దంపతులను విధి విడదీసేసింది. పెళ్లి ముచ్చటైన తీరకుండానే ఆ తీపి క్షణాలను చెరిపేసింది.

ఘనంగా కూతురు పెళ్లి జరిపించి.. ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టిన ఆనందం ఆ తండ్రిది. కుటుంబాన్ని విడిచి వెళ్తున్నా.. వేల కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాననే సంతోషం ఆ కూతురిది. వీరిద్దరి ఆనందాన్ని చూసిన ఆ దేవుడికి కన్నుకుట్టిందో ఏమో... పెళ్లి జరిగి మూడురోజులైనా గడవకముందే... ఆ తండ్రీకూతురులిద్దరినీ కానరాని లోకాలకు తీసుకెళ్లాడు.

నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్ధిపడగ గ్రామానికి చెందిన మౌనికకు మహారాష్ట్రలోని బల్లార్ష మండలం రాజురాకు చెందిన యువకుడితో ఈ నెల 25న వివాహం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం పెళ్లికొడుకు ఇంటివద్ద విందు భోజనం ముగించుకున్నారు. అందరితో సంబరంగా గడిపిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంగా స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు.

అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కడం మండలం పాండ్వాపూర్ వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తాపడింది. ఘటనలో పెళ్లికూతురు మౌనిక, ఆమె తండ్రి రాజయ్య మృతి చెందారు. పెళ్లి కొడుకుతోపాటు పలువురికి గాయాలయ్యాయి. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా జరిగిన ప్రమాదం పెళ్లింట్లో తీరని విషాదం నింపింది.

ఇదీ చదవండి:

Accident: ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌..నిద్రలోనే తండ్రి, కుమారుడు

TEENMAR MALLANNA ARREST: తీన్మార్‌ మల్లన్న అరెస్ట్

తెలంగాణలోని నిర్మల్ జిల్లా పాత మద్ధిపడగలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నవవధువు ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన కొన్నిరోజులే ఆమెకు నిండునూరేళ్లు నిండాయి. అంతసేపు ఆనందంలో మునిగితేలిన ఆ కుటుంబాల్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. పెళ్లి బాజాలతో మోర్మోగిన ఆ లోగిలి కన్నీటి సంద్రమైంది. కొత్త జీవితాన్ని ప్రారంభించకుండానే.. ఆ దంపతులను విధి విడదీసేసింది. పెళ్లి ముచ్చటైన తీరకుండానే ఆ తీపి క్షణాలను చెరిపేసింది.

ఘనంగా కూతురు పెళ్లి జరిపించి.. ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టిన ఆనందం ఆ తండ్రిది. కుటుంబాన్ని విడిచి వెళ్తున్నా.. వేల కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాననే సంతోషం ఆ కూతురిది. వీరిద్దరి ఆనందాన్ని చూసిన ఆ దేవుడికి కన్నుకుట్టిందో ఏమో... పెళ్లి జరిగి మూడురోజులైనా గడవకముందే... ఆ తండ్రీకూతురులిద్దరినీ కానరాని లోకాలకు తీసుకెళ్లాడు.

నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్ధిపడగ గ్రామానికి చెందిన మౌనికకు మహారాష్ట్రలోని బల్లార్ష మండలం రాజురాకు చెందిన యువకుడితో ఈ నెల 25న వివాహం జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం పెళ్లికొడుకు ఇంటివద్ద విందు భోజనం ముగించుకున్నారు. అందరితో సంబరంగా గడిపిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంగా స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు.

అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కడం మండలం పాండ్వాపూర్ వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తాపడింది. ఘటనలో పెళ్లికూతురు మౌనిక, ఆమె తండ్రి రాజయ్య మృతి చెందారు. పెళ్లి కొడుకుతోపాటు పలువురికి గాయాలయ్యాయి. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా జరిగిన ప్రమాదం పెళ్లింట్లో తీరని విషాదం నింపింది.

ఇదీ చదవండి:

Accident: ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌..నిద్రలోనే తండ్రి, కుమారుడు

TEENMAR MALLANNA ARREST: తీన్మార్‌ మల్లన్న అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.