ETV Bharat / crime

మ‌త్తుమందుచ్చి.. విద్యార్థినిపై అత్యాచారం

author img

By

Published : May 19, 2021, 8:34 AM IST

గుంటూరు జిల్లా పొన్నూరులో మ‌త్తుమందుచ్చి విద్యార్థినిపై ఓ దుకాణం యజమాని అత్యాచారానికి పాల్పాడ్డాడు. యజమానిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

a girl raped at ponnuru
a girl raped at ponnuru

గుంటూరు జిల్లా పొన్నూరులో ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ దుకాణం యజమాని అత్యాచారం చేశాడు. తన దుకాణంలో పనిచేస్తున్న యువతికి శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి, అత్యాచారం చేసిన యజమానిపై బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది.

కరోనా కారణంగా కళాశాల మూతపడడంతో ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని పట్టణంలోని ఓ తినుబండారాల దుకాణంలో నెలకు రూ.5 వేల జీతంపై పనిలో చేరింది. దుకాణ యజమాని సోమవారం ఎవరూ లేని సమయంలో ఆమెకు శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. తాగిన కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకుంది. అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులకు చెప్పింది. పొన్నూరు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

గుంటూరు జిల్లా పొన్నూరులో ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ దుకాణం యజమాని అత్యాచారం చేశాడు. తన దుకాణంలో పనిచేస్తున్న యువతికి శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చి, అత్యాచారం చేసిన యజమానిపై బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది.

కరోనా కారణంగా కళాశాల మూతపడడంతో ఏదైనా పనిచేసి కుటుంబానికి ఆసరాగా నిలవాలని పట్టణంలోని ఓ తినుబండారాల దుకాణంలో నెలకు రూ.5 వేల జీతంపై పనిలో చేరింది. దుకాణ యజమాని సోమవారం ఎవరూ లేని సమయంలో ఆమెకు శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. తాగిన కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకుంది. అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులకు చెప్పింది. పొన్నూరు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇదీ చదవండి:

తల్లడిల్లుతున్న పల్లె.. రాకపోకలు పెరగడమే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.