తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పెండింగ్ చలానాలతో తిరుగుతున్న ఓ యువకుడి ద్విచక్రవాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ సురేశ్ తన సిబ్బందితో పాత కూరగాయల మార్కెట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా… ఓ మోటార్ సైకిల్ను నడుపుకుంటూ ఓ వ్యక్తి వచ్చాడు. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న బండిని చాసిస్ ఆధారంగా చెక్ చేయగా… 61 చలాన్లు, రూ. 15,535 పెండింగ్లో ఉన్నట్లు తేలగా పోలీసులు షాక్ అయ్యారు.
నిందితుడు రాజీవనగర్కు చెందిన గుడిపల్లి నిఖిలేశ్గా గుర్తించారు. చలాన్లు చెల్లించకుండా… నంబర్ ప్లేట్లు తీసివేసి తిరుగుతున్నందున కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి