ETV Bharat / city

సాగరతీర నగరం.. రంగుల భవనాలతో స్వాగతం - hilscope

విశాఖపట్నం ఇప్పుడు మరింత శోభాయమానంగా మారింది. హనుమంతవాక వద్ద పచ్చని కొండపై రంగురంగుల భవనాలు కనువిందు చేస్తున్నాయి. రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ ఆలోచనతో సాగరతీర నగరం సరికొత్త అందాలను సంతరించుకుంది.

కొండపై ఉన్న అందాల గృహాలు
author img

By

Published : Jul 6, 2019, 11:59 AM IST

పచ్చని కొండపై రంగుల గృహాలు

విశాఖపట్నం ముఖ ద్వారమైన హనుమంతవాక కూడలి వద్ద... రంగుల భవనాలు నగరవాసులను, సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. స్థానిక కొండపై ఉన్న భవనాలను వివిధ రంగులతో అలంకరించారు విశాఖ రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ బృందం. విదేశాల్లోని గృహాలను తలపించే విధంగా... విశాఖలో కొండపైనున్న 68 ఇళ్లను విభిన్న రంగులతో నింపేశారు. స్మార్ట్ సిటీగా పేరొందిన విశాఖకు అదనపు హంగులు ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేసింది రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ బృందం.

నిత్యం లక్షలాది జనాలు తిరిగే ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా... మధ్య తరగతి కుటుంబాల వారి ఇంటికి పెయింట్ వేసి ఆర్థికంగా మేలు చేశారు. ఎక్కడా నాణ్యతలో లోటులేకుండా ఖరీదైన రంగులను వినియోగించారు. హనుమంతవాకతో పాటు మరికొన్ని జంక్షన్​లను ఎంపిక చేసి అక్కడ కూడా ఇలాగే ఇళ్లకు పెయింటింగ్ వేయడానికి స్వచ్ఛంద సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల విశాఖ మరింత అందంగా కనిపిస్తుందంటున్నారు.

పచ్చని కొండపై రంగుల గృహాలు

విశాఖపట్నం ముఖ ద్వారమైన హనుమంతవాక కూడలి వద్ద... రంగుల భవనాలు నగరవాసులను, సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. స్థానిక కొండపై ఉన్న భవనాలను వివిధ రంగులతో అలంకరించారు విశాఖ రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ బృందం. విదేశాల్లోని గృహాలను తలపించే విధంగా... విశాఖలో కొండపైనున్న 68 ఇళ్లను విభిన్న రంగులతో నింపేశారు. స్మార్ట్ సిటీగా పేరొందిన విశాఖకు అదనపు హంగులు ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేసింది రోటరీ క్లబ్ వైజాగ్ కపుల్స్ బృందం.

నిత్యం లక్షలాది జనాలు తిరిగే ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా... మధ్య తరగతి కుటుంబాల వారి ఇంటికి పెయింట్ వేసి ఆర్థికంగా మేలు చేశారు. ఎక్కడా నాణ్యతలో లోటులేకుండా ఖరీదైన రంగులను వినియోగించారు. హనుమంతవాకతో పాటు మరికొన్ని జంక్షన్​లను ఎంపిక చేసి అక్కడ కూడా ఇలాగే ఇళ్లకు పెయింటింగ్ వేయడానికి స్వచ్ఛంద సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీనివల్ల విశాఖ మరింత అందంగా కనిపిస్తుందంటున్నారు.

Intro:ap_rjy_37_06_mobile_food_truck_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:5 రూపాయలకే పౌష్టికాహారం


Conclusion:తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ క్యాంటీన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన అన్నా క్యాంటీన్ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న వైయస్సార్ అమృత హస్తం ద్వారా నిరుపేదలకు 5 రూపాయలకే ఒకపూట భోజ నం అందిస్తున్న సంగతి మనకు తెలిసినదే ఇది ఆయా రాజకీయ పార్టీలు నాయకులు పేరున నిర్వహిస్తున్న కార్యక్రమాలు కాగా తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన యానంలో ఇదే తరహాలో 5 రూపాయలకే పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టింది కానీ ఇది రాజకీయ పార్టీలకతీతంగా ఢిల్లీకి చెందిన ఐ ఎఫ్ సి ఐ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో యానం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో ప్రతిరోజు పది ప్రాంతాలలో వెయ్యి మందికి భోజనం అందించేందుకు ఏర్పాటు చేశారు వివిధ రకాల పనులపై ఇతర ప్రాంతాలనుండి యానాం వచ్చినవారికి ఒంటరిగా జీవించే వారికి ఒక వాహనం ద్వారా గ్రామాలలో ఆహారాన్ని అందజేయనుంది ఈ కార్యక్రమాన్ని సి ఎఫ్ సీఐ సంస్థ ప్రతినిధులతో కలసి పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.