జాతీయ స్థాయి ర్యాంకు ఆధారంగానే..
ఏఎంసీలో సూపర్ స్పెషాలిటీ విభాగ సీట్లను... పూర్తిగా జాతీయ స్థాయి ర్యాంకు ఆధారంగా నింపాలి. ఫలితంగా ఇందులో ఇతర రాష్ట్రాల వారే అధికంగా ఉన్నారు. విశాఖ వాతావరణానికి త్వరగానే అలవాటు పడిన వీరంతా... పర్యటకానికి ఆటపట్టుగా ఉన్న సుందర నగరంతో ప్రేమలో పడిపోయారు. తెలుగు భాషనూ అలవోకగానే నేర్చుకుంటూ.... రోగులతో చక్కగా సంభాషిస్తున్నారు. వారి సాధక బాధకాలూ తెలుసుకుంటున్నారు. వైద్యకళాశాలకు చెందిన అన్ని స్పెషాలిటీ విభాగాల్లోనూ... ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేదోడువాదోడుగా ఉంటున్నారు.
అనుకూల వాతావరణం కల్పించేందుకు కృషి: ప్రిన్సిపాల్
ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని ఏఎంసీ ప్రిన్సిపల్ సుధాకర్ చెప్పారు. సీట్ల సంఖ్య పెరిగినందున.... కళాశాలలో వసతి సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందని తెలిపారు.
శత వసంతాలకు చేరువవుతున్న ఈ వైద్య కళాశాల....యువతరం వైద్యులను తయారు చేయడంలో అనుభవాన్ని రంగరిస్తోంది. భాష, ప్రాంత తారతమ్యాలు లేకుండా... అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తోంది.
ఇదీ చదవండి : మెళకువలు నేర్చుకున్నాం.. ఇక రయ్యంటూ దూసుకెళ్తాం..