ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​.. విశాఖ రైల్వేస్టేషన్లలో అధికారులు అప్రమత్తం - visakha railway officers action on corona virus

కరోనా వైరస్​పై పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు విశాఖ రైల్వే అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు స్టేషన్​ పరిసరాలను సిబ్బంది శుభ్రం చేస్తున్నారని.. ప్రయాణికులు కూడా వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు చేతులు శుభ్రపరుచుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు థర్మల్​ పరీక్షలు చేపడుతున్నట్లు రైల్వే డీఆర్​ఎం శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

కరోనా ఎఫెక్ట్​.. విశాఖ రైల్వేస్టేషన్లలో అధికారులు అప్రమత్తం
కరోనా ఎఫెక్ట్​.. విశాఖ రైల్వేస్టేషన్లలో అధికారులు అప్రమత్తం
author img

By

Published : Mar 17, 2020, 4:23 PM IST

కరోనా ఎఫెక్ట్​.. విశాఖ రైల్వేస్టేషన్లలో అధికారులు అప్రమత్తం

కరోనా వైరస్​పై విశాఖ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణికులు చేతులు శుభ్రపరుచుకునే వస్తువులు అందుబాటులో ఉంచారు. ఏసీ రైళ్లల్లో కిటికీలకు ఉండే తెరలను తొలగించారు. దుప్పట్లను ఇవ్వడం నిలిపేశారు. రైల్వే సిబ్బంది మాస్క్​లతో విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు విశాఖ రైల్వే ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు వాల్తేర్​ రైల్వే డివిజన్​ డీఆర్​ఎం శ్రీవాస్తవ చెప్పారు. ప్రయాణికులు వ్యకిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. మరోవైపు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు థర్మల్​ పరీక్షలు చేస్తున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు.

కరోనా ఎఫెక్ట్​.. విశాఖ రైల్వేస్టేషన్లలో అధికారులు అప్రమత్తం

కరోనా వైరస్​పై విశాఖ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రయాణికులు చేతులు శుభ్రపరుచుకునే వస్తువులు అందుబాటులో ఉంచారు. ఏసీ రైళ్లల్లో కిటికీలకు ఉండే తెరలను తొలగించారు. దుప్పట్లను ఇవ్వడం నిలిపేశారు. రైల్వే సిబ్బంది మాస్క్​లతో విధులు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు విశాఖ రైల్వే ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు వాల్తేర్​ రైల్వే డివిజన్​ డీఆర్​ఎం శ్రీవాస్తవ చెప్పారు. ప్రయాణికులు వ్యకిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. మరోవైపు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు థర్మల్​ పరీక్షలు చేస్తున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ సునీల్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు.

ఇదీ చూడండి:

కరోనాను జయించే శక్తి మన చేతుల్లోనే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.