ETV Bharat / city

Ayyanna On Ashok Gajapathi Raju: అశోక్ గజపతిరాజుపై నోరు జారటం వారికి తగదు: అయ్యన్న

author img

By

Published : Dec 24, 2021, 5:54 PM IST

Ayyanna On Ramatheertham Incident: ఉన్నత విలువలు కలిగిన అశోక్ గజపతిరాజుపై నోరు జారటం తగదని వైకాపా మంత్రులను తెదేపా నేత అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు. రామతీర్థం ఘటనలో అశోక్ గజతిరాజుపై దౌర్జన్యం చేసిన ఉదంతంపై ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు స్పందించాల్సిన అవసరముందన్నారు.

అశోక్ గజపతిరాజుపై నోరు జారటం వారికి తగదు
అశోక్ గజపతిరాజుపై నోరు జారటం వారికి తగదు

Ayyanna On Ramatheertham Incident: రామతీర్థం ఘటనలో మాజీ కేంద్రమంత్రి, విజయనగర సంస్థానాదీశులైన అశోక్ గజతిరాజుపై దౌర్జన్యం చేసిన ఉదంతంపై ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు స్పందించాల్సిన అవసరముందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. సింహాచలం, పైడిమాంబ వంటి దేవాలయాలను నడిపిస్తూ వేలాది ఎకరాల భూములను అశోక్ గజపతి రాజు కుటుంబం ధారాదత్తం చేశారన్నారు. అటువంటి ఉన్నత విలువలు కలిగిన అశోక్ గజపతిరాజుపై నోరు జారటం తగదని హెచ్చరించారు.

వివాదం ఏంటంటే..

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోడికొండపై రామతీర్థం కోదండరాముని ఆలయ పునర్నిర్మానికి ఈనెల 22న శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కొండపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రొటోకాల్‌ పాటించలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త అయిన తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కనీసం తేదీలు నిర్ణయించే ముందూ చెప్పలేదన్నారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది తీసుకొస్తున్న శిలాఫలకాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అధికారులు, అక్కడున్న వారు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

హిందూ ధర్మాన్ని కాపాడాలి..
దేవదాయ శాఖ ఆనవాయితీని వైకాపా ప్రభుత్వం పాటించట్లేదని అశోక్‌గజపతిరాజు అన్నారు. ట్రస్టు బోర్డులను గౌరవించే పరిస్థితి ఈ సర్కారుకు లేదని విమర్శించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై 147 దాడులు జరిగాయని... ఈ ఘటనల్లో ప్రభుత్వం ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయిందని అశోక్‌గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి.. ఏడాది తర్వాత శంకుస్థాపన చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని.. ఆలయ పునర్నిర్మాణంలో నిబంధనలు పాటించట్లేదని చెప్పారు. అమరావతి రైతుల మాదిరిగానే తనను కూడా ప్రభుత్వాధికారులు వేధిస్తున్నారు అశోక్‌ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.

ఆలయ నిర్మాణం ఆయనకు ఇష్టం లేదు..
అశోక్‌ గజపతిరాజుకు ఆలయ ధర్మకర్తగా గౌరవం ఇచ్చామని, ఈవో, ప్రధాన అర్చకులు వెళ్లి ఆహ్వానించారని దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ప్రొటోకాల్‌ ప్రకారం శిలాఫలకం చేయించామని, ఆలయాన్ని పునర్నిర్మించడం ఆయనకు ఇష్టం లేదని అన్నారు. కార్యక్రమానికి గంట ముందే వెళ్లి వీరంగం సృష్టించారన్నారు. ఆలయాభివృద్ధికి ఆయన ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదని తెలిపారు. రామాలయం సాక్షిగా అశోక్‌ నిజస్వరూపం బయటపడిందని మరో మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

అశోక్ గజపతి రాజుపై కేసు నమోదు..
అశోక్ గజపతిరాజుపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. రామతీర్థం ఘటనపై 2 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం, ఆస్తి ధ్వంసం, గందరగోళం సృష్టించారని కేసులు పెట్టారు. రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి

Botsa on Ashok Gajapathi Raju: వారిపై అశోక్‌ గజపతి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు: మంత్రి బొత్స

Ayyanna On Ramatheertham Incident: రామతీర్థం ఘటనలో మాజీ కేంద్రమంత్రి, విజయనగర సంస్థానాదీశులైన అశోక్ గజతిరాజుపై దౌర్జన్యం చేసిన ఉదంతంపై ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు స్పందించాల్సిన అవసరముందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. సింహాచలం, పైడిమాంబ వంటి దేవాలయాలను నడిపిస్తూ వేలాది ఎకరాల భూములను అశోక్ గజపతి రాజు కుటుంబం ధారాదత్తం చేశారన్నారు. అటువంటి ఉన్నత విలువలు కలిగిన అశోక్ గజపతిరాజుపై నోరు జారటం తగదని హెచ్చరించారు.

వివాదం ఏంటంటే..

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోడికొండపై రామతీర్థం కోదండరాముని ఆలయ పునర్నిర్మానికి ఈనెల 22న శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కొండపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రొటోకాల్‌ పాటించలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త అయిన తనకు సమాచారం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. కనీసం తేదీలు నిర్ణయించే ముందూ చెప్పలేదన్నారు. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది తీసుకొస్తున్న శిలాఫలకాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అధికారులు, అక్కడున్న వారు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది.

హిందూ ధర్మాన్ని కాపాడాలి..
దేవదాయ శాఖ ఆనవాయితీని వైకాపా ప్రభుత్వం పాటించట్లేదని అశోక్‌గజపతిరాజు అన్నారు. ట్రస్టు బోర్డులను గౌరవించే పరిస్థితి ఈ సర్కారుకు లేదని విమర్శించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు. అలాగే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై 147 దాడులు జరిగాయని... ఈ ఘటనల్లో ప్రభుత్వం ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయిందని అశోక్‌గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి.. ఏడాది తర్వాత శంకుస్థాపన చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని.. ఆలయ పునర్నిర్మాణంలో నిబంధనలు పాటించట్లేదని చెప్పారు. అమరావతి రైతుల మాదిరిగానే తనను కూడా ప్రభుత్వాధికారులు వేధిస్తున్నారు అశోక్‌ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.

ఆలయ నిర్మాణం ఆయనకు ఇష్టం లేదు..
అశోక్‌ గజపతిరాజుకు ఆలయ ధర్మకర్తగా గౌరవం ఇచ్చామని, ఈవో, ప్రధాన అర్చకులు వెళ్లి ఆహ్వానించారని దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ప్రొటోకాల్‌ ప్రకారం శిలాఫలకం చేయించామని, ఆలయాన్ని పునర్నిర్మించడం ఆయనకు ఇష్టం లేదని అన్నారు. కార్యక్రమానికి గంట ముందే వెళ్లి వీరంగం సృష్టించారన్నారు. ఆలయాభివృద్ధికి ఆయన ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదని తెలిపారు. రామాలయం సాక్షిగా అశోక్‌ నిజస్వరూపం బయటపడిందని మరో మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

అశోక్ గజపతి రాజుపై కేసు నమోదు..
అశోక్ గజపతిరాజుపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. రామతీర్థం ఘటనపై 2 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం, ఆస్తి ధ్వంసం, గందరగోళం సృష్టించారని కేసులు పెట్టారు. రామతీర్థం ఆలయ ఈవో ప్రసాద్‌రావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి

Botsa on Ashok Gajapathi Raju: వారిపై అశోక్‌ గజపతి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.