సముద్ర మట్టానికి 1.5-5.8 కి.మీ ఎత్తున వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. ఉపరితల ద్రోణి రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ద్రోణి ఒడిశా తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి:
Jogi Ramesh: విజ్ఞాపనపత్రం ఇవ్వడానికే చంద్రబాబు ఇంటికి వెళ్లా: జోగి రమేష్