ETV Bharat / city

విజయవాడ రెడ్​జోన్​ ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్

విజయవాడలోని రెడ్​జోన్​ ప్రాంతాలలో నగర పాలక సంస్థ కమిషనర్​ ప్రసన్న వెంకటేష్​ పర్యటించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆయన గ్లౌజులు, ఫేస్ ఫీల్డ్​లను అందజేశారు.

author img

By

Published : May 6, 2020, 7:25 PM IST

విజయవాడ రెడ్​జోన్​ ప్రాంతాల్లో పర్యటించిన నగర కమిషనర్​
విజయవాడ రెడ్​జోన్​ ప్రాంతాల్లో పర్యటించిన నగర కమిషనర్​

విజయవాడ రెడ్​జోన్​ ప్రాంతాలలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య సిబ్బంది తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని... నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. నగరంలోని రెడ్​జోన్​ ప్రాంతాలైన మారుతీనగర్, గాంధీ నగర్, సింగ్ నగర్ ప్రాంతాలలో ఆయన​ పర్యటించారు. ఆ ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వాహణ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి గ్లౌజులు, పేస్ ఫీల్డ్​లను పంపీణీ చేశారు. దూరప్రాంతాల నుంచి విధులకు వచ్చేవారి కోసం అదనంగా మరో రెండు వాహనాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెడ్​జోన్​ ప్రాంతాలలో అనవసరంగా బయట తిరుగుతున్న వారిని కమిషనర్​ హెచ్చరించారు.

విజయవాడ రెడ్​జోన్​ ప్రాంతాలలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య సిబ్బంది తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని... నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. నగరంలోని రెడ్​జోన్​ ప్రాంతాలైన మారుతీనగర్, గాంధీ నగర్, సింగ్ నగర్ ప్రాంతాలలో ఆయన​ పర్యటించారు. ఆ ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వాహణ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి గ్లౌజులు, పేస్ ఫీల్డ్​లను పంపీణీ చేశారు. దూరప్రాంతాల నుంచి విధులకు వచ్చేవారి కోసం అదనంగా మరో రెండు వాహనాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెడ్​జోన్​ ప్రాంతాలలో అనవసరంగా బయట తిరుగుతున్న వారిని కమిషనర్​ హెచ్చరించారు.

ఇదీ చూడండి: బకాయిలు వెంటనే చెల్లించండి: పారిశుద్ధ్య కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.