ETV Bharat / city

HIGH COURT: జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల అప్పీల్​పై తీర్పు వాయిదా

author img

By

Published : Aug 6, 2021, 3:39 AM IST

జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల అప్పీల్​పై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. సింగిల్​ జడ్జి తీర్పుపై ధర్మాసనం ఎటువంటి తీర్పు వెలువరిస్తోనని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

HIGH COURT
జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల అప్పీల్​పై తీర్పు వాయిదా

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అప్పీపై ధర్మాసనం ముందు వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాల్సిన అవసరం లేదని ఎస్​ఈసీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. కొవిడ్ కారణంగా నిలిచిపోయిన ఎన్నికల్ని పునప్రారంభించేటప్పుడు పోలింగ్ తేదీకి 4 వారాల ముందు కోడ్ విధించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందన్నారు. నాలుగు వారాల ముందు కోడ్​ అమలు అవసరం లేదని.. మున్సిపల్​ ఎన్నికల విషయంలో నిబంధనను అమలు చేయకపోయినా ఎవరూ అభ్యంతరం లేవనెత్తలేదని అన్నారు. సింగిల్ జడ్జి తీర్పులో ఎన్నికల కమిషనర్ పై చేసిన వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఎన్నికల ఫలితాల ప్రకటనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది వి.వేణుగోపాలరావు.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రత్యేకమైనదని అన్నారు . ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్ తేది నాటికి నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయాల్సిన బాధ్యత ఎస్​ఈసీపై ఉందని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహించాల్సిన బాధ్యత ఎస్​ఈసీ పై ఉందన్నారు. నూతన ఎస్​ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించాక.. హడావుడిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. నాలుగు వారాల ముందు కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల్ని పట్టించుకోలేదని.. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పాటించకుండా ఎస్ఈసీ వ్యవహరించారని అఫిడవిట్లో కోర్టుకు తెలిపారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అప్పీపై ధర్మాసనం ముందు వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాల్సిన అవసరం లేదని ఎస్​ఈసీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. కొవిడ్ కారణంగా నిలిచిపోయిన ఎన్నికల్ని పునప్రారంభించేటప్పుడు పోలింగ్ తేదీకి 4 వారాల ముందు కోడ్ విధించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందన్నారు. నాలుగు వారాల ముందు కోడ్​ అమలు అవసరం లేదని.. మున్సిపల్​ ఎన్నికల విషయంలో నిబంధనను అమలు చేయకపోయినా ఎవరూ అభ్యంతరం లేవనెత్తలేదని అన్నారు. సింగిల్ జడ్జి తీర్పులో ఎన్నికల కమిషనర్ పై చేసిన వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసి ఎన్నికల ఫలితాల ప్రకటనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది వి.వేణుగోపాలరావు.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రత్యేకమైనదని అన్నారు . ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్ తేది నాటికి నాలుగు వారాల ముందు కోడ్ అమలు చేయాల్సిన బాధ్యత ఎస్​ఈసీపై ఉందని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహించాల్సిన బాధ్యత ఎస్​ఈసీ పై ఉందన్నారు. నూతన ఎస్​ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించాక.. హడావుడిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. నాలుగు వారాల ముందు కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల్ని పట్టించుకోలేదని.. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను పాటించకుండా ఎస్ఈసీ వ్యవహరించారని అఫిడవిట్లో కోర్టుకు తెలిపారు.

ఇదీ చదవండి:

'నారా లోకేశ్‌ను జైలులో పెట్టేందుకు కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.