ETV Bharat / state

టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌నంటూ సైబర్‌ నేరాలు - నిందితుడి అరెస్ట్ - AP POLICE ARREST CYBER FRAUDSTER

వైద్యానికి ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించిన నేరగాడు - బ్యాంకు రిమిటెన్స్‌ ఛార్జీల పేరిట బాధితులకు టోకరా

CYBER ​​FRAUDS IN AP
CYBER ​​FRAUDS IN AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 12:26 PM IST

AP Police Arrest Cyber Fraudster : సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌నంటూ పలువురిని మోసగించిన ఓ సైబర్‌ నేరగాడిని సీఐడీలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా రాచువారిపల్లెకు చెందిన కొండూరి రాజేష్‌ (34) ఎక్స్‌లో హెల్ప్‌ ఎట్‌ నారా లోకేశ్, హెల్ప్‌ ఎట్‌ పవన్‌ కల్యాణ్, హెల్ప్‌ ఎట్‌ ఎన్‌సీబీఎన్‌ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెట్టేవాడు. వైద్య చికిత్సల కోసం ఆర్థికసాయం అవసరమైన వ్యక్తుల వివరాలు సేకరించేవాడు. అమెరికాకు చెందినదిగా కనిపించే ఫోన్‌ నంబర్‌తో వాట్సప్‌లో వారిని సంప్రదించేవాడు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌గా తనను పరిచయం చేసుకునేవాడు. వైద్య చికిత్సల కోసం ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించేవాడు.

Police Arrest Fake TDP NRI Convener : వారికి విశ్వాసం కల్పించేందుకు తన వాట్సప్‌ ఖాతాకు డీపీగా మంత్రి లోకేశ్‌ ఫొటో పెట్టుకునేవాడు. నకిలీ బ్యాంకు క్రెడిట్‌ రసీదులు పంపి, ఆర్థికసాయం అందిస్తున్నట్లు నమ్మబలికేవాడు. కొద్దిరోజుల తర్వాత వారికి బ్యాంకు మేనేజర్‌లా ఫోన్‌ చేసేవాడు. నగదు జమ కావాలంటే రిమిటెన్స్‌ ఛార్జీలు పంపాలంటూ తన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయించుకునేవాడు. రాజేష్‌పై రాష్ట్రంలో 7, తెలంగాణలో 2 కేసులున్నాయి. తొమ్మిది కేసుల్లో రూ.54.34 లక్షల మేర ప్రజల నుంచి కొల్లగొట్టాడు. ఇతని మోసాలపై ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు సంబంధించిన 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు 16 ఫిర్యాదులు అందాయి. ఇంకా 7 కేసులు నమోదు చేయాల్సి ఉంది.

నేపాల్‌కు పారిపోయి : రాజేష్ నేరాలకు పాల్పడిన తర్వాత మొదట గోవాకు, అక్కడి నుంచి అండమాన్‌కు ఆపై నేపాల్‌కు పారిపోయాడు. నేపాల్‌ నుంచి కూడా సైబర్‌ మోసాలకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ సీఐడీలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌లో గత సంవత్సరం నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు పశ్చిమ బంగాల్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ అతన్ని అరెస్ట్ చేశారు.

ఆ ఫోన్‌కాల్స్‌పై అప్రమత్తత అవసరం : విదేశీ నంబర్ల నుంచి ఆర్థికసాయం అందిస్తామనే పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాల విభాగం తెలిపింది. వాగ్దానాలను నమ్మి, వారి ఖాతాలకు డబ్బు జమ చేయకూడదని పేర్కొంది. రిమిటెన్స్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఛార్జీలు వంటి లావాదేవీలను బ్యాంకు అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించింది.

రోజుకో ముసుగులో సైబర్ వల - లింక్స్​పై క్లిక్ చేశారో అంతే ! - APK File Phone Hacking Cyber Fraud

ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్​ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud

AP Police Arrest Cyber Fraudster : సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త పంథాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌నంటూ పలువురిని మోసగించిన ఓ సైబర్‌ నేరగాడిని సీఐడీలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా రాచువారిపల్లెకు చెందిన కొండూరి రాజేష్‌ (34) ఎక్స్‌లో హెల్ప్‌ ఎట్‌ నారా లోకేశ్, హెల్ప్‌ ఎట్‌ పవన్‌ కల్యాణ్, హెల్ప్‌ ఎట్‌ ఎన్‌సీబీఎన్‌ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెట్టేవాడు. వైద్య చికిత్సల కోసం ఆర్థికసాయం అవసరమైన వ్యక్తుల వివరాలు సేకరించేవాడు. అమెరికాకు చెందినదిగా కనిపించే ఫోన్‌ నంబర్‌తో వాట్సప్‌లో వారిని సంప్రదించేవాడు. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌గా తనను పరిచయం చేసుకునేవాడు. వైద్య చికిత్సల కోసం ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించేవాడు.

Police Arrest Fake TDP NRI Convener : వారికి విశ్వాసం కల్పించేందుకు తన వాట్సప్‌ ఖాతాకు డీపీగా మంత్రి లోకేశ్‌ ఫొటో పెట్టుకునేవాడు. నకిలీ బ్యాంకు క్రెడిట్‌ రసీదులు పంపి, ఆర్థికసాయం అందిస్తున్నట్లు నమ్మబలికేవాడు. కొద్దిరోజుల తర్వాత వారికి బ్యాంకు మేనేజర్‌లా ఫోన్‌ చేసేవాడు. నగదు జమ కావాలంటే రిమిటెన్స్‌ ఛార్జీలు పంపాలంటూ తన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయించుకునేవాడు. రాజేష్‌పై రాష్ట్రంలో 7, తెలంగాణలో 2 కేసులున్నాయి. తొమ్మిది కేసుల్లో రూ.54.34 లక్షల మేర ప్రజల నుంచి కొల్లగొట్టాడు. ఇతని మోసాలపై ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు సంబంధించిన 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు 16 ఫిర్యాదులు అందాయి. ఇంకా 7 కేసులు నమోదు చేయాల్సి ఉంది.

నేపాల్‌కు పారిపోయి : రాజేష్ నేరాలకు పాల్పడిన తర్వాత మొదట గోవాకు, అక్కడి నుంచి అండమాన్‌కు ఆపై నేపాల్‌కు పారిపోయాడు. నేపాల్‌ నుంచి కూడా సైబర్‌ మోసాలకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ సీఐడీలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌లో గత సంవత్సరం నమోదైన ఓ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు పశ్చిమ బంగాల్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ అతన్ని అరెస్ట్ చేశారు.

ఆ ఫోన్‌కాల్స్‌పై అప్రమత్తత అవసరం : విదేశీ నంబర్ల నుంచి ఆర్థికసాయం అందిస్తామనే పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాల విభాగం తెలిపింది. వాగ్దానాలను నమ్మి, వారి ఖాతాలకు డబ్బు జమ చేయకూడదని పేర్కొంది. రిమిటెన్స్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఛార్జీలు వంటి లావాదేవీలను బ్యాంకు అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించింది.

రోజుకో ముసుగులో సైబర్ వల - లింక్స్​పై క్లిక్ చేశారో అంతే ! - APK File Phone Hacking Cyber Fraud

ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్​ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.