ETV Bharat / city

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలి: వర్ల - పరిషత్ ఎన్నికలపై ఎస్​ఈసీకి ఫిర్యాదు న్యూస్

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పాత నోటిఫికేషన్​ను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎస్ఈసీ నీలం సాహ్నిని కలిసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈమేరకు వినతి పత్రాన్ని ఇచ్చారు.

varla ramaiah
varla ramaiah
author img

By

Published : Apr 1, 2021, 3:08 PM IST

Updated : Apr 1, 2021, 5:18 PM IST

గత ఏడాది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు... పరిషత్ ఎన్నికల్లో దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం జరిగిందని... ఎస్ఈసీకి తెలిపినట్లు తెదేపా నేత వర్ల రామయ్య తెలిపారు. 2014లో ఎంపీటీసీలు 2 శాతం ఏకగ్రీవాలు కాగా.. ఇప్పుడు 24 శాతం ఏకగ్రీవాలు చేశారన్నారు. వైకాపా నేతలు, అధికారులతో బెదిరించి దౌర్జన్యంగా బలవంతంగా ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. 2014లో జడ్పీటీసీలు 9 శాతం ఏకగ్రీవమయ్యాయని, ఈసారి బలవంతంగా 19 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు.

గతంలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యమైందని ఎస్ఈసీ దృష్టికి తెచ్చామన్నారు. ఏకగ్రీవాలపై మాజీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు గతంలో రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరామని, అలా కాకుండా ఎన్నికలు కొనసాగిస్తే అప్రజాస్వామ్యంగా జరిగినట్లేనని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రజాస్వామ్యయుత పద్దతుల్లో జరపాలని ఎస్ఈసీని కోరారు.

గత ఏడాది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు... పరిషత్ ఎన్నికల్లో దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం జరిగిందని... ఎస్ఈసీకి తెలిపినట్లు తెదేపా నేత వర్ల రామయ్య తెలిపారు. 2014లో ఎంపీటీసీలు 2 శాతం ఏకగ్రీవాలు కాగా.. ఇప్పుడు 24 శాతం ఏకగ్రీవాలు చేశారన్నారు. వైకాపా నేతలు, అధికారులతో బెదిరించి దౌర్జన్యంగా బలవంతంగా ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు. 2014లో జడ్పీటీసీలు 9 శాతం ఏకగ్రీవమయ్యాయని, ఈసారి బలవంతంగా 19 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు.

గతంలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యమైందని ఎస్ఈసీ దృష్టికి తెచ్చామన్నారు. ఏకగ్రీవాలపై మాజీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు గతంలో రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరామని, అలా కాకుండా ఎన్నికలు కొనసాగిస్తే అప్రజాస్వామ్యంగా జరిగినట్లేనని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రజాస్వామ్యయుత పద్దతుల్లో జరపాలని ఎస్ఈసీని కోరారు.

ఇదీ చదవండి:

గుంటూరులో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సీఎం జగన్‌

Last Updated : Apr 1, 2021, 5:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.