ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో కన్జ్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో పొగాకు ఉత్పత్తుల వల్ల సమాజంలో ఏర్పడే చెడు పరిణామాలు పై కార్యశాల నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది పొగాకు ఉత్పత్తులను వాడి ఏ ఏ రుగ్మతలతో చనిపోతున్నారో తెలియజేశారు. మానవ శరీరంలోని ఊపిరితిత్తులపై పొగాకు ప్రభావం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యా వేత్తలు, వైద్యులు పాల్గొన్నారు. ఈ కార్యశాలలో మేధావుల, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని సంస్థ నిర్వాహకులు డాక్టర్ దివాకర్ బాబు తెలిపారు.
ఇదీచదవండి