ETV Bharat / city

దుర్గామల్లేశ్వరస్వామి రథంపై తాత్కాలికంగా వెండి సింహాల ఏర్పాటు

author img

By

Published : Apr 14, 2021, 7:04 AM IST

ఉగాది పర్వదినం సందర్బంగా.. విజయవాడ దుర్గమల్లేశ్వరస్వామి వార్లను రథంపై ఊరేగించారు. ఇందులో భాగంగా.. రథంపై వెండి సింహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసి రథోత్సవం నిర్వహించారు.

temple
దుర్గామల్లేశ్వరస్వామి రథంపై తాత్కాలికంగా వెండి సింహాల ఏర్పాటు

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా మంగళవారం.. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామిని రథంలో ఊరేగించారు. గతంలో ఈ రథానికి సంబంధించిన నాలుగు వెండి సింహాల బొమ్మల్లో మూడు చోరీకి గురైన విషయం విదితమే. ఆ తర్వాత చోరుడి నుంచి వెండిని స్వాధీనం చేసుకోవడంతో మళ్లీ కొత్తగా నాలుగు సింహాలను తయారు చేయించారు. వాటిని తొలిసారిగా తాత్కాలికంగా అమర్చి రథోత్సవం నిర్వహించారు. అయితే భద్రతా కారణాల నేపథ్యంలో ఊరేగింపు అనంతరం.. ఆ నాలుగు సింహాల బొమ్మలను తొలగించిన దేవస్థానం అధికారులు వాటిని లాకర్‌లో భద్రపరిచారు. రథాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచారు.

ఇదీ చదవండి:

తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా మంగళవారం.. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామిని రథంలో ఊరేగించారు. గతంలో ఈ రథానికి సంబంధించిన నాలుగు వెండి సింహాల బొమ్మల్లో మూడు చోరీకి గురైన విషయం విదితమే. ఆ తర్వాత చోరుడి నుంచి వెండిని స్వాధీనం చేసుకోవడంతో మళ్లీ కొత్తగా నాలుగు సింహాలను తయారు చేయించారు. వాటిని తొలిసారిగా తాత్కాలికంగా అమర్చి రథోత్సవం నిర్వహించారు. అయితే భద్రతా కారణాల నేపథ్యంలో ఊరేగింపు అనంతరం.. ఆ నాలుగు సింహాల బొమ్మలను తొలగించిన దేవస్థానం అధికారులు వాటిని లాకర్‌లో భద్రపరిచారు. రథాన్ని తిరిగి యథాస్థానంలో ఉంచారు.

ఇదీ చదవండి:

రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనపై లేఖల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.