ETV Bharat / city

TDP LEADERS ON YSRCP: గంజాయి నియంత్రణలో జగన్ ప్రభుత్వం విఫలం: తెదేపా

author img

By

Published : Dec 2, 2021, 3:40 PM IST

TDP LEADERS ON YSRCP: ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న​ ప్రజావ్యతిరేక విధానాలపై తెదేపా నేతలు మండిపడ్డారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణలో జగన్ ప్రభుత్వం హోరంగా విఫలమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు.

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేతలు ఫైర్
TDP LEADERS ON YSRCP

TDP LEADERS ON YSRCP : గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఏపీ నుంచి దేశంలోని ఇతరప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతోందని కేంద్ర మంత్రి చెప్పడంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందనేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి వాడకంతోపాటు, మద్యం, నాటాసారా అమ్మకాలు పెరిగాయన్నారు. మాదకద్రవ్యాలను ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుండటంతో మహిళలపై దారుణాలు అధికమయ్యాయని చినరాజప్ప విమర్శించారు.

2018లో రాష్ట్రం నుంచి ఇతరప్రాంతాలకు 33,900కిలోల గంజాయి స్మగ్లింగ్ జరిగితే.. అది 2020 నాటికి లక్షా 6వేల కిలోలకు పెరిగిందన్నారు. 2018లో మాదకద్రవ్యాల బారినపడి 196మంది చనిపోతే.. 2020లో ఆ సంఖ్య 380కు చేరిందన్నారు. 2018లో గంజాయి రవాణా, సాగు ఇతర వ్యవహారాల్లో 170మందికి శిక్షలుపడితే.. 2020లో కేవలం 24 మందిని మాత్రమే శిక్షించారన్నారు. ఈ లెక్కలే రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వ్యవహారం ఎంతగా సాగుతోందో స్పష్టంచేస్తున్నాయని చినరాజప్ప విమర్శించారు.

దళితులను అన్ని విధాలా వంచించారు: వర్ల రామయ్య
ఎస్సీ, ఎస్టీల బాధలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా.. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. వైకాపా రెండున్నరేళ్ల పాలనలో దళితులను అన్ని విధాలా వంచించారని పేర్కొంటూ.. సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. సీఎం జగన్​.. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి.. రూ. 26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఆ నిధులను తిరిగి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను అన్యాయంగా ప్రభుత్వమే లాక్కుందని మండిపడ్డారు.

మహిళ కమిషన్ ఎందుకు స్పందించదు?: వంగలపూడి అనిత
అమరావతి రైతుల పాదయాత్రకు వైకాపా నేతలు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. మహాపాదయాత్రలో.. మహిళా టాయిలెట్లు కూడా తొలగించడం దారుణమన్నారు. దీనిపై మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించరని అనిత నిలదీశారు. పాదయాత్రలో వారిని భోజనం కూడా చేయనియడంలేదని ఆమె దుయ్యబట్టారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వ్యాఖ్యల విషయంలో వంశీ క్షమాపణలు నమ్మలేమన్న అనిత... వంశీ సారీ కాదు... తమకు చంద్రబాబు కన్నీళ్లు కనిపిస్తున్నాయన్నారు. వంశీ ఇటు సారీ అంటారు.. కొడాలి మళ్లీ మీదే తప్పు అంటారని ఆమె విమర్శించారు. వల్లభనేని 5 శాతమే తప్పు చేశారని కొడాలి అనడాన్ని ఎలా చూడాలని అనిత ప్రశ్నించారు. వైకాపా నేతలు క్షమాపణలు చెప్పినట్లు తాము భావించడం లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

Amaravati Padayatra: అలుపెరగక.. ఉద్యమిస్తున్న అన్నదాతలు

TDP LEADERS ON YSRCP : గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఏపీ నుంచి దేశంలోని ఇతరప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతోందని కేంద్ర మంత్రి చెప్పడంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందనేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి వాడకంతోపాటు, మద్యం, నాటాసారా అమ్మకాలు పెరిగాయన్నారు. మాదకద్రవ్యాలను ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుండటంతో మహిళలపై దారుణాలు అధికమయ్యాయని చినరాజప్ప విమర్శించారు.

2018లో రాష్ట్రం నుంచి ఇతరప్రాంతాలకు 33,900కిలోల గంజాయి స్మగ్లింగ్ జరిగితే.. అది 2020 నాటికి లక్షా 6వేల కిలోలకు పెరిగిందన్నారు. 2018లో మాదకద్రవ్యాల బారినపడి 196మంది చనిపోతే.. 2020లో ఆ సంఖ్య 380కు చేరిందన్నారు. 2018లో గంజాయి రవాణా, సాగు ఇతర వ్యవహారాల్లో 170మందికి శిక్షలుపడితే.. 2020లో కేవలం 24 మందిని మాత్రమే శిక్షించారన్నారు. ఈ లెక్కలే రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వ్యవహారం ఎంతగా సాగుతోందో స్పష్టంచేస్తున్నాయని చినరాజప్ప విమర్శించారు.

దళితులను అన్ని విధాలా వంచించారు: వర్ల రామయ్య
ఎస్సీ, ఎస్టీల బాధలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినా.. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. వైకాపా రెండున్నరేళ్ల పాలనలో దళితులను అన్ని విధాలా వంచించారని పేర్కొంటూ.. సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. సీఎం జగన్​.. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి.. రూ. 26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఆ నిధులను తిరిగి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను అన్యాయంగా ప్రభుత్వమే లాక్కుందని మండిపడ్డారు.

మహిళ కమిషన్ ఎందుకు స్పందించదు?: వంగలపూడి అనిత
అమరావతి రైతుల పాదయాత్రకు వైకాపా నేతలు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. మహాపాదయాత్రలో.. మహిళా టాయిలెట్లు కూడా తొలగించడం దారుణమన్నారు. దీనిపై మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించరని అనిత నిలదీశారు. పాదయాత్రలో వారిని భోజనం కూడా చేయనియడంలేదని ఆమె దుయ్యబట్టారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వ్యాఖ్యల విషయంలో వంశీ క్షమాపణలు నమ్మలేమన్న అనిత... వంశీ సారీ కాదు... తమకు చంద్రబాబు కన్నీళ్లు కనిపిస్తున్నాయన్నారు. వంశీ ఇటు సారీ అంటారు.. కొడాలి మళ్లీ మీదే తప్పు అంటారని ఆమె విమర్శించారు. వల్లభనేని 5 శాతమే తప్పు చేశారని కొడాలి అనడాన్ని ఎలా చూడాలని అనిత ప్రశ్నించారు. వైకాపా నేతలు క్షమాపణలు చెప్పినట్లు తాము భావించడం లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

Amaravati Padayatra: అలుపెరగక.. ఉద్యమిస్తున్న అన్నదాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.