తమ సమ్మతి లేకుండా ఏపీ నుంచి రిలీవ్ చేసి తెలంగాణకు కేటాయించారని ఆరోపిస్తూ విద్యుత్ సంస్థల్లోని పలువురు ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్పై జస్టిస్ అశోక్భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపులపై ఏమైనా అభ్యంతరాలుంటే కమిటీకే తెలపాలని చెప్పి, పిటిషన్ను ఉపసంహరించుకోవాలని సూచించింది. పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో విచారణ ముగిసినట్లు కోర్టు పేర్కొంది.
ఇదీ చదవండి: నేడు కృష్ణా బోర్డు సమావేశం.. గుండ్రేవుల చర్చకు వచ్చేనా?