ETV Bharat / city

వేయి మాటల్లో చెప్పలేనివి... ఒక 'చిత్రం'తో చెప్పాడు

చిన్నారుల నుంచి ముసలివారి దాకా చిత్రలేఖనంలో మెళకువలు నేర్పిస్తున్నాడు. చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై మక్కువతో వివిధ కోర్సులను అభ్యసించడమే కాకుండా తన విద్యని అందరికీ నేర్పించాలనే దృక్పథంతో 'చిత్రం' అనే సంస్థను స్థాపించి తన కళను పది మందికి పంచుతున్నాడు.

author img

By

Published : Apr 27, 2019, 9:00 AM IST

Updated : Apr 27, 2019, 9:45 AM IST

వేయి మాటల్లో చెప్పలేని భావాలన్ని ఒక 'చిత్రం'తో చెప్పాడు
సుధీర్​
వేయి మాటల్లో చెప్పలేని భావాలన్ని ఒక 'చిత్రం'తో చెప్పాడు

మెదడుకు పదునుపెట్టి.... కాస్త సృజనాత్మకతను జోడిస్తే చాలు అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఆ కళను గుర్తించి అందుకు తగిన విధంగా సాధన చేసినప్పుడే ఎవరైనా పూర్తి స్థాయిలో రాణించగలరు. సరిగ్గా అదే పని చేశాడు ఆ యువకుడు. తాను నేర్చుకున్న చిత్రకళకు హంగులద్ది చిత్రకారుడిగా పేరు సంపాదించాడు. ప్రతిభ మన సొంతమైతే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్న చందంగా.... తనలోని కళను నిరంతర సాధన చేయడంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. నాలుగు ప్రపంచ స్థాయి రికార్డులు అందుకోవడంతో పాటు.... తనలోని కళను పది మందికీ పంచాలనే ఉద్దేశంతో 'చిత్రం' అనే సంస్థను ప్రారంభించాడు. 2వేలకు మందికి పైగా చిత్రకారులను తయారుచేసి....'చిత్రం' కీర్తిని దశదిశలా వ్యాప్తి చేస్తున్నాడు.

చిత్రలేఖనంలో మెళకువలు నేర్పిస్తున్న ఈ యువకుడి పేరు సుధీర్. చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై మక్కువ పెంచుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాతి నుంచి పూర్తి స్థాయిలో చిత్రలేఖనంపై దృష్టి సారించాడు. చిత్రలేఖనంలో బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అందించే లోయర్, హయ్యర్ కోర్సులను నేర్చుకొని... అనంతరం గుంటూరులో టీటీసీ పూర్తి చేశాడు. అప్పటికీ సంతృప్తి చెందకుండా...కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి BFA హానర్స్ పూర్తి చేశాడు. తనలోని కళను పది మందికీ నేర్పాలనుకున్నాడు. అలా 2008లో విజయవాడలో 'చిత్రం' పేరుతో చిత్రలేఖనం సంస్థను ప్రారంభించాడు. మొదట్లో ఐదుగురితో ప్రారంభమైన సంస్థ... నేడు 2వేల పైచిలుకు విద్యార్థులను చిత్రలేఖనంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాడు సుధీర్......

సుధీర్ వద్ద చిత్రలేఖనం నేర్చుకునే వారిలో ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల బామ్మ వరకు ఉండటం విశేషం. ఇండియన్ టీచర్ ట్రైనింగ్, మలేషియన్ టీచర్ ట్రైనింగ్ కోర్సులు నేర్చుకున్న సుధీర్ కేవలం చిత్రలేఖనంలోనే కాదు....ఆర్కిటెక్చర్, విజువల్ ఆర్ట్స్, ఏరోనాటికల్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంటీరియర్, ఎక్స్ టీరియర్, ట్రాన్స్ పోర్ట్ డిజైనింగ్....లాంటి పదుల కోర్సులకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే అర్హత పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాడు.
గతంలో చిత్రం సంస్థలో చిత్రలేఖనంలో తర్ఫీదు పొంది.....విదేశాల్లో స్థిరపడిన వారు సైతం వేసవి సెలవుల్లో భాగంగా మళ్లీ సుధీర్ వద్దకు వచ్చి తమ కళకు పదును పెట్టుకుంటున్నారు. చిత్రలేఖనానికి అవధులు ఉండవని....ఎంతనేర్చుకున్నా ఎంతోకొంత మిగిలే ఉంటుందని చెబుతున్నారు.

ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా....2015లో 24 గంటల పాటు నిర్విరామంగా చిత్రలేఖనం గీస్తూ తనపేరున మిరాకిల్ వరల్డ్ రికార్డు లిఖించుకున్నాడు సుధీర్. దీనితో పాటు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన ప్రతిభకు సొంతం కాగా....జాతీయ, రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో పురస్కారాలు అందుకున్నాడు. చిత్రలేఖనానికి ఆదరణ లేదంటూ వస్తున్న మాటలను ఖండించే సుధీర్....యానిమేషన్, సినీ రంగం, ఆర్కిటెక్చర్, నిర్మాణ, ఫ్యాషన్ రంగాల్లో చిత్రలేఖనానికి మంచి అవకాశాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు.

ఇదీ చదవండీ :

94వ వసంతంలోకి ఆంధ్ర విశ్వవిద్యాలయం

సుధీర్​
వేయి మాటల్లో చెప్పలేని భావాలన్ని ఒక 'చిత్రం'తో చెప్పాడు

మెదడుకు పదునుపెట్టి.... కాస్త సృజనాత్మకతను జోడిస్తే చాలు అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఆ కళను గుర్తించి అందుకు తగిన విధంగా సాధన చేసినప్పుడే ఎవరైనా పూర్తి స్థాయిలో రాణించగలరు. సరిగ్గా అదే పని చేశాడు ఆ యువకుడు. తాను నేర్చుకున్న చిత్రకళకు హంగులద్ది చిత్రకారుడిగా పేరు సంపాదించాడు. ప్రతిభ మన సొంతమైతే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్న చందంగా.... తనలోని కళను నిరంతర సాధన చేయడంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. నాలుగు ప్రపంచ స్థాయి రికార్డులు అందుకోవడంతో పాటు.... తనలోని కళను పది మందికీ పంచాలనే ఉద్దేశంతో 'చిత్రం' అనే సంస్థను ప్రారంభించాడు. 2వేలకు మందికి పైగా చిత్రకారులను తయారుచేసి....'చిత్రం' కీర్తిని దశదిశలా వ్యాప్తి చేస్తున్నాడు.

చిత్రలేఖనంలో మెళకువలు నేర్పిస్తున్న ఈ యువకుడి పేరు సుధీర్. చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై మక్కువ పెంచుకున్నాడు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాతి నుంచి పూర్తి స్థాయిలో చిత్రలేఖనంపై దృష్టి సారించాడు. చిత్రలేఖనంలో బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అందించే లోయర్, హయ్యర్ కోర్సులను నేర్చుకొని... అనంతరం గుంటూరులో టీటీసీ పూర్తి చేశాడు. అప్పటికీ సంతృప్తి చెందకుండా...కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి BFA హానర్స్ పూర్తి చేశాడు. తనలోని కళను పది మందికీ నేర్పాలనుకున్నాడు. అలా 2008లో విజయవాడలో 'చిత్రం' పేరుతో చిత్రలేఖనం సంస్థను ప్రారంభించాడు. మొదట్లో ఐదుగురితో ప్రారంభమైన సంస్థ... నేడు 2వేల పైచిలుకు విద్యార్థులను చిత్రలేఖనంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దాడు సుధీర్......

సుధీర్ వద్ద చిత్రలేఖనం నేర్చుకునే వారిలో ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల బామ్మ వరకు ఉండటం విశేషం. ఇండియన్ టీచర్ ట్రైనింగ్, మలేషియన్ టీచర్ ట్రైనింగ్ కోర్సులు నేర్చుకున్న సుధీర్ కేవలం చిత్రలేఖనంలోనే కాదు....ఆర్కిటెక్చర్, విజువల్ ఆర్ట్స్, ఏరోనాటికల్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంటీరియర్, ఎక్స్ టీరియర్, ట్రాన్స్ పోర్ట్ డిజైనింగ్....లాంటి పదుల కోర్సులకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే అర్హత పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాడు.
గతంలో చిత్రం సంస్థలో చిత్రలేఖనంలో తర్ఫీదు పొంది.....విదేశాల్లో స్థిరపడిన వారు సైతం వేసవి సెలవుల్లో భాగంగా మళ్లీ సుధీర్ వద్దకు వచ్చి తమ కళకు పదును పెట్టుకుంటున్నారు. చిత్రలేఖనానికి అవధులు ఉండవని....ఎంతనేర్చుకున్నా ఎంతోకొంత మిగిలే ఉంటుందని చెబుతున్నారు.

ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా....2015లో 24 గంటల పాటు నిర్విరామంగా చిత్రలేఖనం గీస్తూ తనపేరున మిరాకిల్ వరల్డ్ రికార్డు లిఖించుకున్నాడు సుధీర్. దీనితో పాటు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన ప్రతిభకు సొంతం కాగా....జాతీయ, రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో పురస్కారాలు అందుకున్నాడు. చిత్రలేఖనానికి ఆదరణ లేదంటూ వస్తున్న మాటలను ఖండించే సుధీర్....యానిమేషన్, సినీ రంగం, ఆర్కిటెక్చర్, నిర్మాణ, ఫ్యాషన్ రంగాల్లో చిత్రలేఖనానికి మంచి అవకాశాలు ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాడు.

ఇదీ చదవండీ :

94వ వసంతంలోకి ఆంధ్ర విశ్వవిద్యాలయం

Intro:నరసరావుపేట మండలంలోని రావిపాడు గ్రామంలో ఒక ప్రయివేట్ గోడౌన్లో అక్రమంగా బియ్యం నిల్వలు ఉంచారన్న సమాచారం మేరకు గురువారం రాత్రి విజిలెన్స్ దాడులు నిర్వహించారు.


Body:25 కిలోలు బరువున్న 324 బస్తాల బియ్యాన్ని నిల్వ వుంచినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన బియ్యంలో పి డి ఎస్ బియ్యం కలిసి వున్నట్లుగా విజిలెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.


Conclusion:బియ్యం నిల్వలు ఎస్.అంకిరెడ్డి, బాబు లకు చెందినవిగా గుర్తించామని, వారిని విచాయిస్తున్నామన్నారు. బియ్యాన్ని పరిశీలించి వాటిలో పి డి ఎస్ కలిపినట్లుగా తేలితే వారిపై కేసు నమోదు చేస్తామని విజిలెన్స్ సిఐ ఎం. సత్యనారాయణ తెలిపారు. దాడుల్లో సీఎస్ టీడీ అశోక్, ఆర్ ఐ సుబ్బారావు, వీఆర్వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052,
8500512909.
Last Updated : Apr 27, 2019, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.