ETV Bharat / city

విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా  పర్యటన

author img

By

Published : Feb 17, 2021, 9:46 PM IST

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా.. విజయవాడలో పర్యటించారు. రూ. 5 కోట్ల వ్యయంతో రైల్వే ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన ఓపీడీ బ్లాక్​ను పరిశీలించారు. 1-10 ప్లాట్​ఫాంలను కలుపుతూ నిర్మించిన మెగా ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు రాయనపాడులోని రైల్వే వ్యాగన్ వర్క్ షాప్​ను సందర్శించారు.

scr gm gajanan malya visited vijayawada railway station
దక్షిణ మద్య రైల్వే జీఎం గజానన్ మాల్యా విజయవాడ పర్యటన

విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి ఓపీడీ బ్లాక్​ను.. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ప్రారంభించారు. రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓపీడీ బ్లాక్​లో సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు. రూ. 9 కోట్ల ఖర్చుతో 1-10 ప్లాట్​ఫాంలను కలుపుతూ విజయవాడ రైల్వేస్టేషన్​లో నిర్మించిన మెగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని జీఎం పరిశీలించారు. మొదటి ప్లాట్ ఫాం సెల్లార్​లో ఆధునీకరించిన రిజర్వేషన్ కౌంటర్లను తనిఖీ చేశారు. రాయనపాడులోని రైల్వే వ్యాగన్ వర్క్ షాప్​ను సందర్శించారు. కొండపల్లి-డోర్నకల్ సెక్షన్ మధ్య మూడో లైన్ పనుల పురోగతిపై ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి ఓపీడీ బ్లాక్​ను.. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా ప్రారంభించారు. రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓపీడీ బ్లాక్​లో సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు. రూ. 9 కోట్ల ఖర్చుతో 1-10 ప్లాట్​ఫాంలను కలుపుతూ విజయవాడ రైల్వేస్టేషన్​లో నిర్మించిన మెగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని జీఎం పరిశీలించారు. మొదటి ప్లాట్ ఫాం సెల్లార్​లో ఆధునీకరించిన రిజర్వేషన్ కౌంటర్లను తనిఖీ చేశారు. రాయనపాడులోని రైల్వే వ్యాగన్ వర్క్ షాప్​ను సందర్శించారు. కొండపల్లి-డోర్నకల్ సెక్షన్ మధ్య మూడో లైన్ పనుల పురోగతిపై ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

విజయవాడలో స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.