ETV Bharat / city

Venkatrami Reddy On PRC: పీఆర్సీ కోసం 10 రోజులు ఆగలేరా ? : వెంకట్రామిరెడ్డి

author img

By

Published : Dec 9, 2021, 4:29 PM IST

Venkatrami Reddy On PRC: పీఆర్సీపై అధికారుల ప్రతిపాదనలను.. సీఎం ఆమోదించారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలపై మండిపడ్డ వెంకట్రామిరెడ్డి.. పీఆర్సీ కోసం 10 రోజులు ఆగలేరా? అని ప్రశ్నించారు.

పీఆర్సీ కోసం 10 రోజులు ఆగలేరా ?
పీఆర్సీ కోసం 10 రోజులు ఆగలేరా ?

Venkatrami Reddy On PRC: పీఆర్సీపై అతి త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేస్తుందని.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. పీఆర్సీపై అధికారుల ప్రతిపాదనలను.. సీఎం ఆమోదించారని తెలిపారు. 3, 4 రోజుల్లో పీఆర్సీపై ప్రకటిస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిందన్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలపై మండిపడ్డ వెంకట్రామిరెడ్డి.. పీఆర్సీ కోసం 10 రోజులు ఆగలేరా ? అని ప్రశ్నించారు. మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు 010 పద్దు కింద వేతనాలు కోరుతున్నారన్న వెంకట్రామిరెడ్డి.. అందుకు సీఎం అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు.

ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం భేటీ..
CM Jagan on PRC : పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్న వేళ.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం.. ఎంత మేర వేతనాలు పెంచితే బాగుంటుందనే అంశంపై అభిప్రాయాలు సేకరించినట్టు సమాచారం. ఉద్యోగుల ఇతర సమస్యలపైనా చర్చించినట్టు తెలుస్తోంది.

సీపీఎస్ రద్దు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను శాశ్వతం చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లు సైతం పరిష్కరిస్తే బడ్జెట్ పై ఎంత భారం పడుతుందనే విషయమై సమాలోచనలు చేసినట్టు సమాచారం. పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తానని ఈనెల 3న తిరుపతిలో ఉద్యోగులకు సీఎం హామీ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం కొద్ది రోజులుగా ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

Venkatrami Reddy On PRC: పీఆర్సీపై అతి త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేస్తుందని.. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పారు. పీఆర్సీపై అధికారుల ప్రతిపాదనలను.. సీఎం ఆమోదించారని తెలిపారు. 3, 4 రోజుల్లో పీఆర్సీపై ప్రకటిస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిందన్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలపై మండిపడ్డ వెంకట్రామిరెడ్డి.. పీఆర్సీ కోసం 10 రోజులు ఆగలేరా ? అని ప్రశ్నించారు. మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు 010 పద్దు కింద వేతనాలు కోరుతున్నారన్న వెంకట్రామిరెడ్డి.. అందుకు సీఎం అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు.

ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం భేటీ..
CM Jagan on PRC : పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్న వేళ.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన సీఎం.. ఎంత మేర వేతనాలు పెంచితే బాగుంటుందనే అంశంపై అభిప్రాయాలు సేకరించినట్టు సమాచారం. ఉద్యోగుల ఇతర సమస్యలపైనా చర్చించినట్టు తెలుస్తోంది.

సీపీఎస్ రద్దు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను శాశ్వతం చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లు సైతం పరిష్కరిస్తే బడ్జెట్ పై ఎంత భారం పడుతుందనే విషయమై సమాలోచనలు చేసినట్టు సమాచారం. పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తానని ఈనెల 3న తిరుపతిలో ఉద్యోగులకు సీఎం హామీ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం కొద్ది రోజులుగా ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి

PRC Update : పీఆర్సీ తాజా.. ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం లోతు చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.