ETV Bharat / city

దళితుడు, విద్యావంతుడు ఎంపీ కాకూడదా ?: ఎమ్మెల్సీ డొక్కా - డొక్కా మాణిక్య వరప్రసాద్ న్యూస్

ఫిజియోథెరపిస్ట్‌గా తిరుపతి ఉప ఎన్నిక వైకాపా అభ్యర్థి గురుమూర్తి సేవ చేస్తుంటే ఆ వృత్తిని అవమానిస్తారా ? అని ప్రతిపక్షాలను ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. దళితుడు, విద్యావంతుడు ఎంపీ కాకూడదా ? అని ప్రశ్నించారు.

mlc dokka comments on ycp mp candidate
దళితుడు, విద్యావంతుడు ఎంపీ కాకూడదా ?
author img

By

Published : Apr 12, 2021, 10:09 PM IST

దళితుడు, ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఎంపీగా వైకాపా నిలబెడితే.. ఆయనను అవమానించేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. దళితుడు, విద్యావంతుడు ఎంపీ కాకూడదా ? అని ప్రశ్నించారు. ఫిజియోథెరపిస్ట్‌గా గురుమూర్తి సేవ చేస్తుంటే ఆ వృత్తిని అవమానిస్తారా ? అని నిలదీశారు. కులవృత్తులను అవమానిస్తూ ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని చంద్రబాబు బయటపెట్టుకున్నారని ఆక్షేపించారు.

సీఎం జగన్ దళిత పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమూ చేయని మేలు జగన్‌ ప్రభుత్వం మాత్రమే చేసిందన్నారు. దళితులపై దాడులు జరిగితే ఎన్నడూ లేని విధంగా బాధ్యులపై చర్యలు తీసుకున్నది వైకాపా ప్రభుత్వమేనన్నారు.

దళితుడు, ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఎంపీగా వైకాపా నిలబెడితే.. ఆయనను అవమానించేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. దళితుడు, విద్యావంతుడు ఎంపీ కాకూడదా ? అని ప్రశ్నించారు. ఫిజియోథెరపిస్ట్‌గా గురుమూర్తి సేవ చేస్తుంటే ఆ వృత్తిని అవమానిస్తారా ? అని నిలదీశారు. కులవృత్తులను అవమానిస్తూ ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని చంద్రబాబు బయటపెట్టుకున్నారని ఆక్షేపించారు.

సీఎం జగన్ దళిత పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వమూ చేయని మేలు జగన్‌ ప్రభుత్వం మాత్రమే చేసిందన్నారు. దళితులపై దాడులు జరిగితే ఎన్నడూ లేని విధంగా బాధ్యులపై చర్యలు తీసుకున్నది వైకాపా ప్రభుత్వమేనన్నారు.

ఇదీచదవండి

'పోలీసులను అడ్డుపెట్టుకొని దాడులా ?..మీ రౌడీయిజానికి భయపడం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.