ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. విజయవాడలోని 54వ డివిజన్లో మంత్రి పర్యటించారు. ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. రెండు ఏళ్లుగా కానరాని తెదేపా నాయకులు ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని మంత్రి వెలంపల్లి ప్రశ్నించారు. అనంతరం 41వ డివిజన్ పార్టీ కార్యాలయన్ని మంత్రి ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగిడిపల్లి చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో పలువురు వైకాపాలో చేరగా.. పార్టీ జెండా కప్పి మంత్రి వెల్లంపల్లి ఆహ్వానించారు.
ఇదీ చూడండి: వైకాపాకు మరో అవకాశాన్నిచ్చి ప్రజలు మోసపోవద్దు: బొండా ఉమ