ETV Bharat / city

కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు శంకుస్థాపన

author img

By

Published : Oct 21, 2020, 5:29 PM IST

విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు విద్యుత్తు, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. నగరంలోని ఏపీఐఐసీ కాలనీలో ఏర్పాటు చేసిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

Minister Laid foundation for Pollution control board offices
కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు శంకుస్థాపన

కాలుష్య నియంత్రణ మండలి విస్తరణలో భాగంగా విజయవాడలో ప్రాంతీయ, జోనల్‌ కార్యాలయాలు, ప్రయోగశాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలను నిరంతరం తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ప్రకృతికి హాని కలిగించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

విజయవాడలో ప్రాంతీయ కార్యాలయాన్ని 1976లో ఏర్పాటు చేయగా.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన జోనల్‌ కార్యాలయాన్ని 2000లో ఏర్పాటు చేసుకున్నామని మంత్రి వివరించారు. అయితే అప్పటి నుంచి అవి అద్దె భవనాల్లోనే కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 22.57కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత భవనాలు నిర్మించుకోవడం సంతోషదాయకమన్నారు.

1500 చదరపు గజాల స్థలంలో నిర్మించే ఈ భవనంలో ప్రాంతీయ, జోనల్‌ కార్యాలయాలతో పాటు.. అధునాత వసతులతో కూడిన ప్రయోగశాలన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో పారదర్శకతను పెంచేందుకు ఈ బాధ్యతను పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించినట్టు మంత్రి వెల్లడించారు. పూర్తి చేసేందుకు 18 నెలలు గడవు విధించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి మెంబర్‌ సెక్రటరీ వివేక్‌యాదవ్, జోనల్‌ కార్యాలయం జాయింట్‌ చీఫ్‌ ఇంజినీరు ఎన్‌.వి.భాస్కరరావు, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరు ఎస్‌.ఎస్‌.ఎస్‌.మురళీ పాల్గొన్నారు.

కాలుష్య నియంత్రణ మండలి విస్తరణలో భాగంగా విజయవాడలో ప్రాంతీయ, జోనల్‌ కార్యాలయాలు, ప్రయోగశాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలను నిరంతరం తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ప్రకృతికి హాని కలిగించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

విజయవాడలో ప్రాంతీయ కార్యాలయాన్ని 1976లో ఏర్పాటు చేయగా.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన జోనల్‌ కార్యాలయాన్ని 2000లో ఏర్పాటు చేసుకున్నామని మంత్రి వివరించారు. అయితే అప్పటి నుంచి అవి అద్దె భవనాల్లోనే కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 22.57కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత భవనాలు నిర్మించుకోవడం సంతోషదాయకమన్నారు.

1500 చదరపు గజాల స్థలంలో నిర్మించే ఈ భవనంలో ప్రాంతీయ, జోనల్‌ కార్యాలయాలతో పాటు.. అధునాత వసతులతో కూడిన ప్రయోగశాలన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో పారదర్శకతను పెంచేందుకు ఈ బాధ్యతను పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగించినట్టు మంత్రి వెల్లడించారు. పూర్తి చేసేందుకు 18 నెలలు గడవు విధించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి మెంబర్‌ సెక్రటరీ వివేక్‌యాదవ్, జోనల్‌ కార్యాలయం జాయింట్‌ చీఫ్‌ ఇంజినీరు ఎన్‌.వి.భాస్కరరావు, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరు ఎస్‌.ఎస్‌.ఎస్‌.మురళీ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రోజు మార్చి రోజు తరగతులు: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.