ETV Bharat / city

Group-1 Results: గ్రూపు-1 ప్రధాన పరీక్ష ఫలితాల విడుదల

author img

By

Published : May 27, 2022, 7:51 AM IST

Group-1 Results: గ్రూపు-1 (నోటిఫికేషన్‌ 27/2018) ప్రధాన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 325 మంది మౌఖిక పరీక్షలకు అర్హత సాధించారు. వారి హాల్‌టికెట్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది.

Group-1 Results released in andhra pradesh
గ్రూపు-1 ప్రధాన పరీక్ష ఫలితాల విడుదల

Group-1 Results: గ్రూపు-1 (నోటిఫికేషన్‌ 27/2018) ప్రధాన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 325 మంది మౌఖిక పరీక్షలకు అర్హత సాధించారు. వారి హాల్‌టికెట్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. జూన్‌ 15 నుంచి మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తొలుత ఈ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్‌ మూల్యాంకనం చేసి ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ విధానంలో జరిగిన మూల్యాంకనంవల్ల తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సాధారణ పద్ధతిలోనే (పెన్ను, పేపర్‌) మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

గత అక్టోబరులో జారీ చేసిన ఆదేశాల ప్రకారం 3 నెలల్లో ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. ఇప్పుడు విడుదల చేసింది. డిజిటల్‌ మూల్యాంకనం ఫలితాల్లో ముందు వరసలో ఉన్న పలువురు అభ్యర్థులు వెనుకబడ్డారు. వెనుక వరసలో ఉన్నవారు ముందుకు వచ్చారు. జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియను సీసీ కెమెరాల మధ్య నిర్వహించినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. గ్రూపు-1 పరీక్షలను 2020లో డిసెంబరు 14 నుంచి 20 వరకు నిర్వహించారు. మౌఖిక పరీక్షలకు ఎంపికైన 325 మందిలో 124 మంది తొలి జాబితాలో ఉన్నవారేనని సమాచారం. తొలి జాబితాలో ముందు వరుసలో ఉన్న వారిలో పలువురు వెనుకబడ్డారు.

ఇదీ చదవండి:

Group-1 Results: గ్రూపు-1 (నోటిఫికేషన్‌ 27/2018) ప్రధాన పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ గురువారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 325 మంది మౌఖిక పరీక్షలకు అర్హత సాధించారు. వారి హాల్‌టికెట్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. జూన్‌ 15 నుంచి మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తొలుత ఈ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్‌ మూల్యాంకనం చేసి ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ విధానంలో జరిగిన మూల్యాంకనంవల్ల తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సాధారణ పద్ధతిలోనే (పెన్ను, పేపర్‌) మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

గత అక్టోబరులో జారీ చేసిన ఆదేశాల ప్రకారం 3 నెలల్లో ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. ఇప్పుడు విడుదల చేసింది. డిజిటల్‌ మూల్యాంకనం ఫలితాల్లో ముందు వరసలో ఉన్న పలువురు అభ్యర్థులు వెనుకబడ్డారు. వెనుక వరసలో ఉన్నవారు ముందుకు వచ్చారు. జవాబు పత్రాలను దిద్దే ప్రక్రియను సీసీ కెమెరాల మధ్య నిర్వహించినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. గ్రూపు-1 పరీక్షలను 2020లో డిసెంబరు 14 నుంచి 20 వరకు నిర్వహించారు. మౌఖిక పరీక్షలకు ఎంపికైన 325 మందిలో 124 మంది తొలి జాబితాలో ఉన్నవారేనని సమాచారం. తొలి జాబితాలో ముందు వరుసలో ఉన్న వారిలో పలువురు వెనుకబడ్డారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.