ETV Bharat / city

పదో తరగతి విద్యార్థులంతా పాస్: ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

కరోనా వ్యాప్తి ప్రభావంతో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. విద్యార్థులందరినీ పాస్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 నాటికి నమోదైన పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్టు ప్రకటించింది.

author img

By

Published : Jul 14, 2020, 3:42 PM IST

govt g.o on 10th class students
govt g.o on 10th class students

మార్చి 2020 నాటికి నమోదైన పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్​సీ, ఓఎస్ఎస్​సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన హాల్ టికెట్లు పొందిన విద్యార్థులందరినీ.. ఎలాంటి గ్రేడ్ పాయింట్లూ ఇవ్వకుండానే ఉత్తీర్ణులను చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్​తోపాటు పదో తరగతి బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మార్చి 2020 నాటికి నమోదైన పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్​సీ, ఓఎస్ఎస్​సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన హాల్ టికెట్లు పొందిన విద్యార్థులందరినీ.. ఎలాంటి గ్రేడ్ పాయింట్లూ ఇవ్వకుండానే ఉత్తీర్ణులను చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్​తోపాటు పదో తరగతి బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 1,916 కరోనా కేసులు.. ఒక్క రోజులోనే 43 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.