ETV Bharat / city

పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ.1372 కోట్లు కేటాయింపు

author img

By

Published : Nov 21, 2020, 6:38 AM IST

Updated : Nov 21, 2020, 9:13 AM IST

గుజరాత్​కు చెందిన అమూల్ సంస్థ భాగస్వామ్యంతో ప్రభుత్వం పాలు సేకరించనుంది. ఏపీ-అముల్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్డి, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1372 కోట్లను వెచ్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ, నిల్వ కోసం బల్క్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఏఎంసీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు... ప్రభుత్వం రూ.272 కోట్లను వ్యయం చేయనుంది.

government allocates of Rs.1372 crores for the development of the dairy industry in the state
పాడి పరిశ్రమ అభివృద్డికి రూ.1372 కోట్లు కేటాయింపు

ఏపీ - అమూల్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1372 కోట్లను వెచ్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డెయిరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్​లో భాగంగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ.1089 కోట్లను రుణంగా తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర వాటాగా రూ.272 కోట్లను వెచ్చించనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ, నిల్వ కోసం బల్క్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఏఎంసీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఈ నిధులు వ్యయం చేయనున్నారు. రాష్ట్రంలో పాల సేకరణ, మార్కెటింగ్ కోసం గుజరాత్​కు చెందిన ఆనంద్ పాల సహకార సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 200 లక్షల లీటర్ల పాలను సేకరించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తొలిదశలో ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో పాల సేకరణను ఆముల్ మొదలు పెట్టింది.

ఏపీ - అమూల్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1372 కోట్లను వెచ్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డెయిరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్​లో భాగంగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ.1089 కోట్లను రుణంగా తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర వాటాగా రూ.272 కోట్లను వెచ్చించనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో పాల సేకరణ, నిల్వ కోసం బల్క్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఏఎంసీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఈ నిధులు వ్యయం చేయనున్నారు. రాష్ట్రంలో పాల సేకరణ, మార్కెటింగ్ కోసం గుజరాత్​కు చెందిన ఆనంద్ పాల సహకార సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 200 లక్షల లీటర్ల పాలను సేకరించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తొలిదశలో ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో పాల సేకరణను ఆముల్ మొదలు పెట్టింది.

ఇదీ చదవండి:

నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన

Last Updated : Nov 21, 2020, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.