ETV Bharat / city

సచివాలయం వద్ద అటవీశాఖ ఒప్పంద ఉద్యోగుల నిరసన - అటవీశాఖ ఒప్పంద ఉద్యోగుల ఆందోళన

ఏడు నెలలుగా జీతాల్లేక కనీస అవసరాలూ తీరక.. అల్లాడుతున్నామని అటవీశాఖ ఒప్పంద ఉద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. ఉద్యోగ పొడిగింపు ఉత్తర్వులు రాని పరిస్థితుల్లో.. తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్న 217 మంది ఉద్యోగులు.. తమకు న్యాయం చేయాలంటూ సచివాలయం వద్ద నిరసన తెలిపారు.

protest
సచివాలయం వద్ద అటవీశాఖ ఒప్పంద ఉద్యోగుల నిరసన
author img

By

Published : Mar 30, 2021, 5:21 PM IST

సచివాలయం వద్ద అటవీశాఖ ఒప్పంద ఉద్యోగుల నిరసన

అటవీ శాఖలో 2004లో నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులకు పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వక పోవడంపై.. వారంతా ఆందోళనకు దిగారు. ఏడు నెలలుగా జీతాలు లేవంటూ సచివాలయం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన చేపట్టారు.

కనీస అవసరాలు తీరనంతగా.. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. తమతో పాటు ఉద్యోగాలు పొందిన తెలంగాణ రాష్ట్ర సిబ్బందికి.. పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ, ఒడిశా తరహాలో ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం.. ప్రసవించిన మహిళకు కాకుండా.. శిశువును..?

సచివాలయం వద్ద అటవీశాఖ ఒప్పంద ఉద్యోగుల నిరసన

అటవీ శాఖలో 2004లో నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులకు పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వక పోవడంపై.. వారంతా ఆందోళనకు దిగారు. ఏడు నెలలుగా జీతాలు లేవంటూ సచివాలయం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన చేపట్టారు.

కనీస అవసరాలు తీరనంతగా.. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. తమతో పాటు ఉద్యోగాలు పొందిన తెలంగాణ రాష్ట్ర సిబ్బందికి.. పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ, ఒడిశా తరహాలో ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం.. ప్రసవించిన మహిళకు కాకుండా.. శిశువును..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.