వేకువ జామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి అనుమతించినట్లు దుర్గగుడి ఈవో సురేష్ బాబు వెల్లడించారు. 13 వేల మందికి ఆన్ లైన్ ద్వారా టికెట్లు జారీ చేశామన్నారు. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో పరిమిత సంఖ్యలో అప్పటికప్పుడు టికెట్లు జారీ చేస్తామన్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని సురేష్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి: దుర్గమ్మకు నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్