ETV Bharat / city

Devineni: మీరు వచ్చి 29 నెలలైంది.. ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా ?: దేవినేని

author img

By

Published : Oct 25, 2021, 7:53 PM IST

వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకున్న 6 ప్రాజెక్టుల్లో దేనికెంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం జలవనరులశాఖ మంత్రి అనిల్​కు ఉందా? అని మాజీ మంత్రి దేవినేని ప్రశ్నించారు. పోలవరం సహా 6 ప్రధాన ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.

మీరు వచ్చి 29 నెలలైంది.. ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా ?
మీరు వచ్చి 29 నెలలైంది.. ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా ?

వైకాపా పెద్దలు కమీషన్లు దండుకుని రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులను గాలికొదిలేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చి 29 నెలలైందని.. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా ? అని నిలదీశారు.

'తెదేపా ప్రభుత్వ హయాంలో 62 ప్రాజెక్టులను చేపట్టి 23 పూర్తి చేసింది. వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకున్న 6 ప్రాజెక్టుల్లో దేనికెంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం మంత్రికి ఉందా ?. కేవలం రూ.6 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వంశధార, నాగావళిని పూర్తి చేయకుండా చేతకాని కబుర్లు చెబుతున్నారు. పోలవరంలో జలవిద్యుతుత్పత్తి ప్రారంభించి ఉంటే ఏటా రాష్ట్రానికి రూ.3 వేల కోట్ల ఆదాయంతో పాటు 960 మెగావాట్ల విద్యుతుత్పత్తి జరిగేది. నెల్లూరు సంగం బ్యారేజీ, వెలుగొండ టన్నెల్, అవుకు టన్నెల్ పనులు పట్టించుకోకుండా గాలి కొదిలేశారు. రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టుల పనులు ప్రణాళిక లేకుండా జరుగుతున్నాయని మీడియాలో వస్తే మంత్రి కోపంతో పత్రికల్ని నిందిస్తూ కుల రాజకీయాలు చేస్తున్నారు. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడకుండా గత 29 నెలల్లో ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారో మంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి.' అని దేవినేని డిమాండ్ చేశారు.

వారి వ్యవహారశైలి పశువుల కంటే హీనం

చంద్రబాబు కుటుంబసభ్యులపై మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు పశువులకంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఉమా ధ్వజమెత్తారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేలా ఇరువురి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పరిటాల రవి బొమ్మపెట్టుకుని తిరిగిన వంశీ ఇప్పుడు సునీతమ్మ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. బూతుల మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం, హైదరాబాద్​లో ఆస్తుల రరక్షణ కోసం నీచంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. కొడాలి నానీ, వంశీల భాషపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

TDP leaders: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి.. డీజీపీని రీకాల్‌ చేయాలి: చంద్రబాబు

వైకాపా పెద్దలు కమీషన్లు దండుకుని రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులను గాలికొదిలేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చి 29 నెలలైందని.. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా ? అని నిలదీశారు.

'తెదేపా ప్రభుత్వ హయాంలో 62 ప్రాజెక్టులను చేపట్టి 23 పూర్తి చేసింది. వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకున్న 6 ప్రాజెక్టుల్లో దేనికెంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం మంత్రికి ఉందా ?. కేవలం రూ.6 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే వంశధార, నాగావళిని పూర్తి చేయకుండా చేతకాని కబుర్లు చెబుతున్నారు. పోలవరంలో జలవిద్యుతుత్పత్తి ప్రారంభించి ఉంటే ఏటా రాష్ట్రానికి రూ.3 వేల కోట్ల ఆదాయంతో పాటు 960 మెగావాట్ల విద్యుతుత్పత్తి జరిగేది. నెల్లూరు సంగం బ్యారేజీ, వెలుగొండ టన్నెల్, అవుకు టన్నెల్ పనులు పట్టించుకోకుండా గాలి కొదిలేశారు. రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టుల పనులు ప్రణాళిక లేకుండా జరుగుతున్నాయని మీడియాలో వస్తే మంత్రి కోపంతో పత్రికల్ని నిందిస్తూ కుల రాజకీయాలు చేస్తున్నారు. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడకుండా గత 29 నెలల్లో ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారో మంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి.' అని దేవినేని డిమాండ్ చేశారు.

వారి వ్యవహారశైలి పశువుల కంటే హీనం

చంద్రబాబు కుటుంబసభ్యులపై మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు పశువులకంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఉమా ధ్వజమెత్తారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేలా ఇరువురి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పరిటాల రవి బొమ్మపెట్టుకుని తిరిగిన వంశీ ఇప్పుడు సునీతమ్మ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. బూతుల మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జగన్ రెడ్డి కళ్లల్లో ఆనందం, హైదరాబాద్​లో ఆస్తుల రరక్షణ కోసం నీచంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. కొడాలి నానీ, వంశీల భాషపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

TDP leaders: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి.. డీజీపీని రీకాల్‌ చేయాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.