ETV Bharat / city

విజయవాడ రైల్వే డివిజన్​పై కరోనా ప్రభావం: తగ్గిన ఆదాయం

author img

By

Published : Apr 10, 2021, 10:51 AM IST

ఆదాయ ఆర్జనలో ముందుండే విజయవాడ డివిజన్... కొవిడ్ దెబ్బతో వెనుకబడింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం తక్కువ ఆదాయాన్ని ఆర్జించింది. సరకు రవాణాను తగ్గించడం వల్లే ఆదాయం తగ్గినట్లు విజయవాడ డీఆర్​ఎం శ్రీనివాస్ తెలిపారు.

విజయవాడ రైల్వే డివిజన్​పై కరోనా ప్రభావం
విజయవాడ రైల్వే డివిజన్​పై కరోనా ప్రభావం

కరోనా ప్రభావం... రైల్వే ఆదాయంపై గణనీయంగా పడింది. ఆదాయ ఆర్జనలో ఏటా ముందుండే విజయవాడ డివిజన్... కొవిడ్ దెబ్బతో వెనుకబడింది. గతేడాది మార్చి నుంచి ఏప్రిల్ వరకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల 494 కోట్లు ఆదాయాన్ని మాత్రమే నమోదు చేసింది. వీటిలో సరకు రవాణా ద్వారా రూ. 2వేల 197.27 కోట్లు ఆదాయం ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం తక్కువ. లాక్​డౌన్ కారణంగా సరకు రవాణాను తగ్గించడం వల్లే ఆదాయం తగ్గినట్లు విజయవాడ డీఆర్​ఎం శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.

గతేడాది ప్రయాణికుల రవాణా ద్వారా విజయవాడ డివిజన్ రూ. 219.84 కోట్లు మాత్రమే ఆర్జించింది. డివిజన్ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. విజయవాడ రైల్వేస్టేషన్​ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డివిజన్​లో పెండింగ్​లో ఉన్న నిర్మాణాలు సహా డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులను పూర్తి చేశామని... మిగిలినవి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ వివరించారు.

కరోనా ప్రభావం... రైల్వే ఆదాయంపై గణనీయంగా పడింది. ఆదాయ ఆర్జనలో ఏటా ముందుండే విజయవాడ డివిజన్... కొవిడ్ దెబ్బతో వెనుకబడింది. గతేడాది మార్చి నుంచి ఏప్రిల్ వరకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2వేల 494 కోట్లు ఆదాయాన్ని మాత్రమే నమోదు చేసింది. వీటిలో సరకు రవాణా ద్వారా రూ. 2వేల 197.27 కోట్లు ఆదాయం ఆర్జించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 21 శాతం తక్కువ. లాక్​డౌన్ కారణంగా సరకు రవాణాను తగ్గించడం వల్లే ఆదాయం తగ్గినట్లు విజయవాడ డీఆర్​ఎం శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.

గతేడాది ప్రయాణికుల రవాణా ద్వారా విజయవాడ డివిజన్ రూ. 219.84 కోట్లు మాత్రమే ఆర్జించింది. డివిజన్ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. విజయవాడ రైల్వేస్టేషన్​ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. డివిజన్​లో పెండింగ్​లో ఉన్న నిర్మాణాలు సహా డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులను పూర్తి చేశామని... మిగిలినవి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీనివాస్ వివరించారు.

ఇదీ చదవండి:

తెదేపా అధినేత చంద్రబాబును కలిసిన రాయచోటి వైకాపా నేత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.