ETV Bharat / city

'ఎస్సీ కమిషన్​ను ఛైర్మన్​ను ఎప్పుడు నియమిస్తారు?'

author img

By

Published : Sep 8, 2020, 2:51 PM IST

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని కాంగ్రెస్ నేత గంగాధర్ ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా.. ఇప్పటి వరకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్​ను నియమించలేదని అన్నారు. దళితులకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.

gangadhar press meet
కాంగ్రెస్ నేత గంగాధర్

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలులో చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. ఏపీసీసీ ఉపాధ్యక్షులు గంగాధర్ అన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఎస్సీ కమిషన్ ఛైర్మన్​ని ఇప్పటి వరకు నియమించలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కేవలం ఎస్సీ, ఎస్టీల మీదే కాక ఇతర కులాలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ఇది కేవలం కులాల సమస్యే కాకుండా రాజకీయ సమస్యగా తయారైందన్నారు. వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులపై ఈనెల 11న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. మిగతా రాజకీయ పక్షాలని కలుపుకొని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలులో చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. ఏపీసీసీ ఉపాధ్యక్షులు గంగాధర్ అన్నారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఎస్సీ కమిషన్ ఛైర్మన్​ని ఇప్పటి వరకు నియమించలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కేవలం ఎస్సీ, ఎస్టీల మీదే కాక ఇతర కులాలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ఇది కేవలం కులాల సమస్యే కాకుండా రాజకీయ సమస్యగా తయారైందన్నారు. వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులపై ఈనెల 11న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. మిగతా రాజకీయ పక్షాలని కలుపుకొని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

ఇదీ చదవండి:

'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.