ETV Bharat / city

వరుస ప్రమాదాలు మనసును కలచివేస్తున్నాయి: చంద్రబాబు - ప్రకాశం ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి న్యూస్

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో జరిగిన ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తివ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుస బెట్టి ప్రమాదాలు జరగడం మనసును కలచివేస్తున్నాయి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

chandrababu and lokesh condolence to prakasham accident victims family
chandrababu and lokesh condolence to prakasham accident victims family
author img

By

Published : May 14, 2020, 10:39 PM IST

వరుసబెట్టి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ప్రమాదాలు మనసును కలచివేస్తున్నాయి. విశాఖలో విషవాయువు 12 మందిని బలి తీసుకున్న ఘటన జరిగి వారం తిరక్కముందే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర మరో ఘోరప్రమాదంలో 9 మంది వ్యవసాయకూలీలు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించిన వారంతా కూలీలు కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారి కుటుంబాలకు అండగా నిలవాలి. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలి.

-నారా చంద్రబాబు నాయుడు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర జరిగిన ఘోరప్రమాదంలో 9 మంది మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక తెలుగుదేశం నాయకులను ఆరాతీయగా ప్రమాదానికి గురైన వారంతా మిరపకోతకు వెళ్ళొస్తున్న వ్యవసాయకూలీలని తెలిసింది. ఇది చాలా బాధాకరం. లాక్ డౌన్ కష్టాల నుంచి వెసులుబాటు దొరికి ఇప్పుడిప్పుడే పనులకు వెళ్తున్న సమయంలో ఇలా జరగడం దారుణం. మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

వరుసబెట్టి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ప్రమాదాలు మనసును కలచివేస్తున్నాయి. విశాఖలో విషవాయువు 12 మందిని బలి తీసుకున్న ఘటన జరిగి వారం తిరక్కముందే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర మరో ఘోరప్రమాదంలో 9 మంది వ్యవసాయకూలీలు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించిన వారంతా కూలీలు కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారి కుటుంబాలకు అండగా నిలవాలి. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలి.

-నారా చంద్రబాబు నాయుడు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర జరిగిన ఘోరప్రమాదంలో 9 మంది మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక తెలుగుదేశం నాయకులను ఆరాతీయగా ప్రమాదానికి గురైన వారంతా మిరపకోతకు వెళ్ళొస్తున్న వ్యవసాయకూలీలని తెలిసింది. ఇది చాలా బాధాకరం. లాక్ డౌన్ కష్టాల నుంచి వెసులుబాటు దొరికి ఇప్పుడిప్పుడే పనులకు వెళ్తున్న సమయంలో ఇలా జరగడం దారుణం. మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

-నారా లోకేశ్

ఇదీ చదవండి: విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.