ETV Bharat / city

"అట్రాసిటీ చట్టంపై అవగాహన అవసరం"

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై మరింత అవగాహన అవసరమని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు.

author img

By

Published : Aug 8, 2019, 11:14 PM IST

బేర్ ఫుట్ లాయర్స్ ప్రాజెక్టు
ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం

దళితుల్లో చట్టాలపై అవగాహన తెచ్చేందుకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ సహకారంతో... శాంతి వెల్ఫేర్ అసోసియేషన్ బేర్ ఫుట్ లాయర్స్ పేరుతో ఓ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. విజయవాడ ఐఎంఏ హాల్​లో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రాజెక్ట్ ను, టోల్ ఫ్రీ నెంబర్ను ప్రారంభించారు. గ్రామాల్లో దళితులపై దాడులు జరుగుతున్నా.. ఎస్సీ ,ఎస్టీ చట్టాలపై అవగాహన లేకపోవటంతో ముందుకు రాలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో మనుషుల మధ్య అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆధునిక కాలంలో సైతం అంటరానితనం రూపుమాపలేకపోవటం బాధాకరమన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న ఎస్సీ ,ఎస్టీ కేసుల్లో నిందితులకు శిక్షపడే సంఘటనలు తక్కువగా ఉన్నాయని శాంతి వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ రెబెకా రాణి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల పాటు కళాశాలలు, విద్యాసంస్థలు, గ్రామాల్లో యువతకు చట్టాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. శిక్షణ తీసుకున్న పారాలీగల్స్.. దళితులకు అండగా ఉండి వారికి న్యాయ సహాయం చేస్తారని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం

దళితుల్లో చట్టాలపై అవగాహన తెచ్చేందుకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ సహకారంతో... శాంతి వెల్ఫేర్ అసోసియేషన్ బేర్ ఫుట్ లాయర్స్ పేరుతో ఓ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. విజయవాడ ఐఎంఏ హాల్​లో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రాజెక్ట్ ను, టోల్ ఫ్రీ నెంబర్ను ప్రారంభించారు. గ్రామాల్లో దళితులపై దాడులు జరుగుతున్నా.. ఎస్సీ ,ఎస్టీ చట్టాలపై అవగాహన లేకపోవటంతో ముందుకు రాలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. చాలా దేశాల్లో మనుషుల మధ్య అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆధునిక కాలంలో సైతం అంటరానితనం రూపుమాపలేకపోవటం బాధాకరమన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న ఎస్సీ ,ఎస్టీ కేసుల్లో నిందితులకు శిక్షపడే సంఘటనలు తక్కువగా ఉన్నాయని శాంతి వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ రెబెకా రాణి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల పాటు కళాశాలలు, విద్యాసంస్థలు, గ్రామాల్లో యువతకు చట్టాలపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. శిక్షణ తీసుకున్న పారాలీగల్స్.. దళితులకు అండగా ఉండి వారికి న్యాయ సహాయం చేస్తారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి...

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన

Intro:Ap_vsp_48_08_grama_revenew_sahayakula_Andolana_Ab_AP10077_k.Bhanojirao_8008574722
ఎన్నికలకు ముందు గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘ సభ్యులు ఆందోళన చేపట్టారు విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డిఓ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు


Body:ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష కార్యదర్శులు కె.నాగేశ్వరరావు ,సాంబశివరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తమకు నెలకి 10,500 జీతం ఇచ్చేవారన్నారు. దీన్ని 15వేలు చేస్తానని ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక తమ కోసం పట్టించుకోవడం లేదని వాపోయారు గ్రామ రెవెన్యూ సహాయకుల కు గ్రామ రెవెన్యూ అధికారులు, అటెండర్లు, డ్రైవర్లు, వాచ్ మాన్ లుగా పదోన్నతి కల్పించాలని కోరారు.


Conclusion:బైట్1 నాగేశ్వరరావు, సంఘ అధ్యక్షులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.