ETV Bharat / city

HIGH COURT: మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు ఆలోచించడం ఏమిటి?

author img

By

Published : Sep 2, 2021, 3:16 AM IST

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టేందుకు ఆలోచించడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డిజిటల్ చెల్లింపు విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారని పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ న్యాయవాది కిరణ్ తెలిపారు.

HIGH COURT
HIGH COURT

చిన్న చిన్న దుకాణాల్లోనూ.. డిజిటల్ చెల్లింపులు సాధ్యమవుతుంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఆలోచించడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డిజిటల్ చెల్లింపు విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారని పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ న్యాయవాది కిరణ్ తెలిపారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎస్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు విచారణ చేసింది.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన దాసరి ఇమ్మాన్యుయేల్ హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది నాగ ప్రవీణ్ వాదనలు వినిపిస్తూ.. డిజిటల్ చెల్లింపుల విధానానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఆమోదం ఉందన్నారు. ఈ తరహా చెల్లింపులను ప్రోత్సహించేందుకు జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలను పర్యవేక్షిస్తున్న బేవరేజ్ కార్పొరేషన్ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయడం లేదన్నారు.

చిన్న చిన్న దుకాణాల్లోనూ.. డిజిటల్ చెల్లింపులు సాధ్యమవుతుంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఆలోచించడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డిజిటల్ చెల్లింపు విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారని పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ న్యాయవాది కిరణ్ తెలిపారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎస్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు విచారణ చేసింది.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ప్రకాశం జిల్లా జాండ్రపేటకు చెందిన దాసరి ఇమ్మాన్యుయేల్ హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది నాగ ప్రవీణ్ వాదనలు వినిపిస్తూ.. డిజిటల్ చెల్లింపుల విధానానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఆమోదం ఉందన్నారు. ఈ తరహా చెల్లింపులను ప్రోత్సహించేందుకు జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలను పర్యవేక్షిస్తున్న బేవరేజ్ కార్పొరేషన్ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయడం లేదన్నారు.

ఇదీ చదవండి:

జల విద్యుదుత్పత్తిలో ఛైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అసంతృప్తి..వాకౌట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.