దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కౌశలాచార్య అవార్డును అందుకున్నారు. దేశంలో ఏ ఇతర ఆర్టీసీ... లేని రీతిలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించినందుకు గాను కేంద్రం ఈ అవార్డుతో సత్కరించింది. ఆర్టీసీలో 2016 నుంచి 2019 వరకు అత్యధికంగా 5 వేల 397 మంది ఐటీఐ అప్రెంటీస్ లను నియమించి వారికి శిక్షణ ఇచ్చింది.
మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్టు, తదితర ట్రేడుల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా స్టైఫండ్ రూపంలో 7 వేలు అందించింది ఏపీఎస్ఆర్టీసీ. శిక్షణ అనంతరం వారు.. ఉపాధి అవకాశాలు పొందడంలో సహకరించింది. గుర్తించిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కౌశలాచార్య పురస్కారాన్ని ఏపీఎస్ఆర్టీసీకి అందించింది.
ఇదీ చదవండి: