అప్పులు తేవడం, ఆస్తులు అమ్మి పరిపాలించడం గొప్ప కాదని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 నెలల్లోనే రూ.1 లక్ష 75 వేల కోట్లు అప్పు చేశారని తులసిరెడ్డి అన్నారు. మనకంటే పెద్ద రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రెండింతలుగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తులసిరెడ్డి సూచించారు.
ఇదీచదవండి.