ETV Bharat / city

రేపట్నుంచి 4 రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్న ఎస్‌ఈసీ

author img

By

Published : Jan 31, 2021, 7:43 PM IST

Updated : Jan 31, 2021, 8:50 PM IST

రేపట్నుంచి 4 రోజులపాటు రాష్ట్రంలో ఎస్​ఈసీ నిమ్మగడ్డ పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో.. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో ఎస్​ఈసీ సమీక్ష నిర్వహించనున్నారు.

నాలుగు జిల్లాల్లో ఎస్​ఈసీ నిమ్మగడ్డ పర్యటన
నాలుగు జిల్లాల్లో ఎస్​ఈసీ నిమ్మగడ్డ పర్యటన

రేపట్నుంచి 4 రోజులపాటు రాష్ట్రంలో ఎస్​ఈసీ నిమ్మగడ్డ పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో.. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్ల గురించి అధికారులతో మాట్లాడనున్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఎస్​ఈసీ సమీక్ష నిర్వహించనున్నారు.

సోమవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్న ఎస్ఈసీ...సాయంత్రం 4.30 గం.కు శ్రీకాకుళం జిల్లా అధికారులతో, రాత్రి 7 గం.కు విజయనగరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రికి విశాఖకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 9 గం.కు విశాఖ జిల్లా అధికారులతో, 1.30 గం.కు తూర్పుగోదావరి, రాత్రి 7 గం.కు పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై 3న చిత్తూరు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 4న ఉదయం నెల్లూరు జిల్లా అధికారులతో, మధ్యాహ్నం ప్రకాశం జిల్లా అధికారులతో, సాయంత్రం గుంటూరు జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం అదేరోజు రాత్రికి ఆయన విజయవాడ చేరుకోనున్నారు.

రేపట్నుంచి 4 రోజులపాటు రాష్ట్రంలో ఎస్​ఈసీ నిమ్మగడ్డ పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో.. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్ల గురించి అధికారులతో మాట్లాడనున్నారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఎస్​ఈసీ సమీక్ష నిర్వహించనున్నారు.

సోమవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్న ఎస్ఈసీ...సాయంత్రం 4.30 గం.కు శ్రీకాకుళం జిల్లా అధికారులతో, రాత్రి 7 గం.కు విజయనగరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రికి విశాఖకు చేరుకొని అక్కడే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 9 గం.కు విశాఖ జిల్లా అధికారులతో, 1.30 గం.కు తూర్పుగోదావరి, రాత్రి 7 గం.కు పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటించనున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై 3న చిత్తూరు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 4న ఉదయం నెల్లూరు జిల్లా అధికారులతో, మధ్యాహ్నం ప్రకాశం జిల్లా అధికారులతో, సాయంత్రం గుంటూరు జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం అదేరోజు రాత్రికి ఆయన విజయవాడ చేరుకోనున్నారు.

ఇదీచదవండి

ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు

Last Updated : Jan 31, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.